
తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్
ముక్కోణపు సిరీస్లో భాగంగా భారత్తో తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది.
మెల్బోర్న్: ముక్కోణపు సిరీస్లో భాగంగా భారత్తో తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది. ఆదివారం జరుగుతున్న ఈ మ్యాచ్లో 268 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఆసీస్ స్కోరు 51 పరుగుల వద్ద.. భారత్ పేసర్ ఉమేష్ యాదవ్.. వార్నర్ను అవుట్ చేశాడు. వార్నర్.. రైనాకు క్యాచిచ్చాడు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన భారత్.. ఓపెనర్ రోహిత్ శర్మ(138) సెంచరీ, రైనా (51) హాఫ్ సెంచరీ చేయడంతో నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 267 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఆరు వికెట్లు తీసి భారత్ను కట్టడి చేశాడు. రోహిత్, రైనా మినహా ఇతర భారత బ్యాట్స్మెన్ పరుగుల వేటలో విఫలమయ్యారు.