రోహిత్ బాటలోనే కోహ్లి! | virat Kohli to co own Pro Wrestling League team Bengaluru Yodhas | Sakshi
Sakshi News home page

రోహిత్ బాటలోనే కోహ్లి!

Dec 10 2015 6:24 PM | Updated on Sep 3 2017 1:47 PM

రోహిత్ బాటలోనే కోహ్లి!

రోహిత్ బాటలోనే కోహ్లి!

ఇప్పుడు ప్రముఖ క్రికెటర్లు రెజ్లింగ్ బాట పడుతున్నారు.

న్యూఢిల్లీ: ఇప్పుడు ప్రముఖ క్రికెటర్లు రెజ్లింగ్ బాట పడుతున్నారు. తొలుత రోహిత్ శర్మ రెజ్లింగ్ వైపు అడుగులు వేయగా.. ప్రస్తుతం టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా ఆ బాటలోనే నడిచాడు. ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యూఎల్)లో భాగంగా ఇప్పటికే ఉత్తరప్రదేశ్ వారియర్స్ జట్టులో భాగస్వామ్యం దక్కించుకున్నరోహిత్ సహ యజమానిగా వ్యవహరిస్తుండగా..  తాజాగా బెంగళూరు యోధాస్ జట్టుకు విరాట్ కోహ్లి సహ యజమాని అయ్యాడు.   దీంతో రెజ్లింగ్ లో భాగస్వామ్యం పంచుకున్నరెండో క్రికెటర్ గా విరాట్ గుర్తింపు పొందాడు.ఇలా విరాట్, రోహిత్ లతో పాటు, బాలీవుడ్ సూపర్ స్టార్ ధర్మేంద్ర కూడా రెజ్లింగ్ జట్లకు కో-ఓనర్స్ గా ఉండటంతో ఆ క్రీడకు ఆమాంతం ఆదరణ పెరిగిపోయింది. 

 

ప్రొ రెజ్లింగ్ లో బెంగళూరు యోధాస్ జట్టు దక్కడం పట్ల కోహ్లి ఆనందం వ్యక్తం చేశాడు. 'బెంగళూర్ యోధాస్  జట్టుతో భాగస్వామ్యం కావడం నిజంగా నమ్మశక్యంగా లేదు. రెజ్లింగ్ లో జట్టుకు కొత్త కానీ.. నగరానికి కాదు. బెంగళూర్ జట్టు చాలా పటిష్టమైన జట్టు.  మా జట్టులో యోధుల పోరాటాన్ని చూడటానికి ఆతృతుగా ఉన్నా' అని కోహ్లి  పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా  శుక్రవారం ఉత్తరప్రదేశ్ వారియర్స్ తన మొదటి పోరులో బెంగళూర్ యోధాస్ తో తలపడనుంది. గురువారం రాత్రి ఆరంభం కాబోతున్న  రెజ్లింగ్ తొలి పోరులో ఢిల్లీ వీర్ తో పంజాబ్ రాయల్స్ తలపడనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement