‘పంచ్‌’ పడకముందే రెండు పతకాలు | Two medals in boxing | Sakshi
Sakshi News home page

‘పంచ్‌’ పడకముందే రెండు పతకాలు

Nov 19 2017 12:56 AM | Updated on Nov 19 2017 12:56 AM

Two medals in boxing - Sakshi

గువాహటి: ఆతిథ్య భారత్‌కు ప్రపంచ మహిళల యూత్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో పోటీలు ప్రారంభంకాకముందే రెండు పతకాలు ఖాయమయ్యాయి. ఆదివారం మొదలయ్యే ఈ మెగా ఈవెంట్‌కు సంబంధించిన ‘డ్రా’ను శనివారం తీశారు. ప్లస్‌ 81 కేజీల విభాగంలో నేహా యాదవ్‌... 81 కేజీల విభాగంలో అనుపమలకు నేరుగా సెమీఫైనల్లోకి ‘బై’ లభించింది.

దాంతో వీరిద్దరికి కనీసం కాంస్య పతకాలు లభిస్తాయి. మరోవైపు 75 కేజీల విభాగంలో తెలుగమ్మాయి గోనెళ్ల నిహారికకు తొలి రౌండ్‌లో ‘బై’ లభించింది. క్వార్టర్‌ ఫైనల్లో నిహారిక ప్రత్యర్థిగా జార్జియా ఒకానర్‌ (ఇంగ్లండ్‌) లేదా యు జియటెంగ్‌ (చైనా) ఉండే అవకాశముంది. భారత్‌కే చెందిన జ్యోతి (51 కేజీలు), నీతూ (48 కేజీలు)లకు కూడా తొలి రౌండ్‌లో ‘బై’ లభించింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement