తెలుగు టైటాన్స్‌ రెండో విజయం | Telugu Titans beat UP Yoddha | Sakshi
Sakshi News home page

తెలుగు టైటాన్స్‌ రెండో విజయం

Oct 14 2018 1:45 AM | Updated on Oct 14 2018 1:45 AM

Telugu Titans beat UP Yoddha  - Sakshi

సోనెపట్‌: ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్‌ వరుసగా రెండో విజయం సాధించింది. శనివారం జోన్‌ ‘బి’లో భాగంగా జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో స్టార్‌ రైడర్‌ రాహుల్‌ చౌదరి (9 పాయింట్లు), నీలేశ్‌ సోలంకి (5 పాయింట్లు) చెలరేగడంతో తెలుగు టైటాన్స్‌ 34–29 తో యూపీ యోధాపై గెలిచింది. ట్యాక్లింగ్‌లో అబోజర్‌ (6 పాయింట్లు) ఆకట్టుకున్నాడు.

యూపీ యోధా తరఫున ప్రశాం త్‌ 11, రిషాంక్‌ 7 పాయింట్లు సాధించా రు. జోన్‌ ‘ఎ’లో భాగంగా జరిగిన మరో మ్యాచ్‌లో యు ముంబా 53–26తో హరియాణా స్టీలర్స్‌పై గెలిచింది. యు ముంబా తరఫున అభిషేక్‌ సింగ్‌ 12 రైడ్‌ పాయింట్లు సాధించగా... హరియాణా తరఫున వికాస్‌ 9 రైడ్‌ పాయింట్లు సాధించాడు. నేడు పట్నా పైరేట్స్‌తో యూపీ యోధా, హరియాణా స్టీలర్స్‌తో పుణేరీ పల్టన్‌ జట్లు తలపడనున్నాయి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement