స్టీవ్ స్మిత్ మరో రికార్డు | steve smith gets another record | Sakshi
Sakshi News home page

స్టీవ్ స్మిత్ మరో రికార్డు

Mar 25 2017 3:05 PM | Updated on Sep 5 2017 7:04 AM

స్టీవ్ స్మిత్ మరో రికార్డు

స్టీవ్ స్మిత్ మరో రికార్డు

భారత్ తో జరుగుతున్న టెస్టు సిరీస్ లో ఆసీస్ కెప్టెన్ గా అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డును ఇప్పటికే తన ఖాతాలో వేసుకున్న స్టీవ్ స్మిత్..తాజాగా మరో రికార్డును కూడా నమోదు చేశాడు.

ధర్మశాల: భారత్ తో జరుగుతున్న టెస్టు సిరీస్ లో ఆసీస్ కెప్టెన్ గా అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డును ఇప్పటికే తన ఖాతాలో వేసుకున్న స్టీవ్ స్మిత్..తాజాగా మరో  రికార్డును కూడా నమోదు చేశాడు. భారత్ లో ఒక సిరీస్ లో మూడు సెంచరీలు సాధించిన రెండో పర్యాటక కెప్టెన్ గా అరుదైన రికార్డు నెలకొల్పాడు. అంతకుముందు అలెస్టర్ కుక్ ఈ ఘనతను సాధించాడు. 2012-13 సీజన్ లో భారత్ లో పర్యటించిన ఇంగ్లండ్ జట్టుకు  నాయకత్వం వహించిన కుక్ మూడు శతకాలను సాధించిన తొలి కెప్టెన్ గా ఉన్నాడు.


భారత్ తో నాల్గో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో స్టీవ్ స్మిత్(111) శతకం నమోదు చేశాడు. దాంతో ఈ సిరీస్ లో మూడు శతకాలను స్మిత్ తన ఖాతాలో వేసుకున్నాడు.  తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో శతకం సాధించిన స్మిత్.. ఆ తరువాత మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో శతకం చేశాడు.రాంచీలో జరిగిన మూడో టెస్టులో స్మిత్ 178 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇది భారత్ లో ఆసీస్ కెప్టెన్ నమోదు చేసిన అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డుగా నమోదైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement