'వరల్డ్ కప్' ఫిక్సింగ్ పై ఫిర్యాదు చేస్తే.. | Sri Lanka sports minister willing to probe 2011 World Cup final | Sakshi
Sakshi News home page

'వరల్డ్ కప్' ఫిక్సింగ్ పై ఫిర్యాదు చేస్తే..

Jul 20 2017 1:20 PM | Updated on Nov 9 2018 6:43 PM

'వరల్డ్ కప్' ఫిక్సింగ్ పై ఫిర్యాదు చేస్తే.. - Sakshi

'వరల్డ్ కప్' ఫిక్సింగ్ పై ఫిర్యాదు చేస్తే..

2011 వరల్డ్ కప్లో భారత్ -శ్రీలంక జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఫిక్సింగ్ జరిగిందంటూ ఇటీవల అర్జున రణతుంగ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

కొలంబో: 2011 వరల్డ్ కప్లో భారత్ -శ్రీలంక జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఫిక్సింగ్ జరిగిందంటూ ఇటీవల అర్జున రణతుంగ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.  దీనిపై వెంటనే విచారణ చేపట్టాలని శ్రీలంక ప్రభుత్వాని డిమాండ్ చేశాడు. ఈ ఫైనల్‌ మ్యాచ్ కు కామెంటేటర్ గా వ్యవహరించిన రణతుంగ ఫిక్సింగ్‌ ఆరోపణలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే రణతుంగ వ్యాఖ్యలపై శ్రీలంక ప్రభుత్వం తాజాగా స్పందించింది.

 

ఆ మ్యాచ్ లో ఫిక్సింగ్ జరిగినట్లు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే విచారణ చేపట్టడానికి తాము సిద్ధంగా ఉన్నామని శ్రీలంక క్రీడా మంత్రి దయసిరి జయశేఖర తెలిపారు. 'రాత పూర్వకంగా ఫిర్యాదు చేయండి. ఆ ఫిర్యాదు అందిన వెంటనే విచారణ చేపట్టడానికి సిద్ధంగా ఉన్నా' అని జయశేఖర బదులిచ్చారు. కొన్ని రోజుల క్రితం భారత్- శ్రీలంకల వరల్డ్ కప్-2011 ఫైనల్ మ్యాచ్ పై తనకు అనుమానాలు ఉన్నాయంటూ రణతుంగ ఆరోపించాడు. లంకేయులు ఆడిన తీరు పలు అనుమానాలకు తావిచ్చిందంటూ ఆరేళ్ల తరువాత రణతుంగా కొత్త పల్లవి అందుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement