ఎస్‌సీ రైల్వే జట్టు జయభేరి | South Central Railway team won | Sakshi
Sakshi News home page

ఎస్‌సీ రైల్వే జట్టు జయభేరి

May 1 2015 3:50 AM | Updated on Aug 28 2018 7:57 PM

రాష్ట్ర వాలీబాల్ సంఘం మాజీ కార్యదర్శి ఎల్.వెంకట్రామ్‌రెడ్డి (ఎల్‌వీఆర్) స్మారకార్థం నిర్వహిస్తున్న వాలీబాల్ టోర్నమెంట్‌లో దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్) జట్టు శుభారంభం చేసింది.

వెంకట్రామ్‌రెడ్డి స్మారక వాలీబాల్ టోర్నీ
 
ఎల్బీ స్టేడియం : రాష్ట్ర వాలీబాల్ సంఘం మాజీ కార్యదర్శి ఎల్.వెంకట్రామ్‌రెడ్డి (ఎల్‌వీఆర్) స్మారకార్థం నిర్వహిస్తున్న వాలీబాల్ టోర్నమెంట్‌లో దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్) జట్టు శుభారంభం చేసింది. ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ హాస్టల్ సంక్షేమ సంఘం (ఏపీఎస్‌హెచ్‌డబ్ల్యూఏ) ఆధ్వర్యంలో ఇక్కడి ఎల్బీ స్టేడియంలోని వాలీబాల్ మైదానంలో గురువారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఎస్‌సీరైల్వే జట్టు 25-11, 25-27, 25-19 స్కోరుతో  హైదరాబాద్ ఇన్‌కంట్యాక్స్ ఆఫీస్ జట్టుపై విజయం సాధించింది.

ఎస్‌సీఆర్ జట్టులో ఆనంద్, శివ, సురేష్ సింగ్ చక్కటి నైపుణ్యాన్ని కనబర్చారు. ఇన్ కంట్యాక్ ఆఫీస్ జట్టులో చైతన్య, రాధాకృష్ణ రెడ్డిలు రాణించారు. అంతకు ముందు ఈ పోటీల ప్రారంభ వేడుకలకు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ (శాట్స్) మేనేజింగ్ డెరైక్టర్ ఎ.దినకర్‌బాబు ముఖ్య అతిథిగా విచ్చేసి టోర్నీని లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వాలీబాల్ అర్జున వార్డు గ్రహీత ముళినీరెడ్డి, రాష్ట్ర వాలీబాల్ మాజీ కోశాధికారి జి. రామచందర్‌రెడ్డి, ఏపీఎస్‌హెచ్‌డబ్ల్యూఏ అధ్యక్షుడు డాక్టర్ పి.వెంకటేశ్వరరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎన్.రామిరెడ్డి, కిరణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement