క్వార్టర్స్ లో సింధు | Sindhu, Sameer enter quarter-finals, Kashyao bows out | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్ లో సింధు

Sep 14 2017 1:24 PM | Updated on Sep 19 2017 4:33 PM

క్వార్టర్స్ లో సింధు

క్వార్టర్స్ లో సింధు

కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పివి సింధు క్వార్టర్స్లోకి ప్రవేశించారు.

సియోల్: కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పివి సింధు క్వార్టర్స్లోకి ప్రవేశించారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్ పోరులో సింధు 22-20, 21-17 తేడాతో  ప్రపంచ 16వ ర్యాంకర్‌ నిచావోన్‌ జిందాపోల్‌ (థాయ్‌లాండ్‌)పై గెలిచి క్వార్టర్స్ కు చేరారు.  తొలి గేమ్ లో పోరాడి గెలిచిన సింధు.. రెండో గేమ్ లో మాత్రం పెద్దగా ప్రతి ఘటన ఎదుర్కోలేదు. క్వార్టర్ ఫైనల్లో జపాన్ క్రీడాకారిణి మితానితో సింధు తలపడనున్నారు.

మరొకవైపు పురుషుల సింగిల్స్ పోరులో సమీర్ వర్మ క్వార్టర్స్ కు చేరారు. సమీర్ వర్మ 21-19, 21-13 తేడాతో హాంకాంగ్ క్రీడాకారుడు వింగ్ కీ విన్సెంట్ పై గెలిచి క్వార్టర్స్ లోకి ప్రవేశించారు. 41 నిమిషాల పాటు  జరిగిన పోరులో సమీర్ వర్మ ఏకపక్ష విజయం సాధించారు. కాగా, పారుపల్లి కశ్యప్ మాత్రం ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement