‘అర్జున’కు ధావన్‌, మంధాన

Shikhar Dhawan And Mandana Nominated for Arjuna Award - Sakshi

కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసిన బీసీసీఐ

సాక్షి, ముంబై: క్రీడల్లో రెండో అత్యున్నత పురస్కారమైన అర్జున అవార్డుకు టీమిండియా డాషింగ్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌, భారత మహిళా క్రికెటర్‌ స్మృతి మంధానల పేర్లను భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రతిపాదించింది. ఈ విషయాన్ని బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరి బుధవారం మీడియాకు తెలిపారు. ప్రస్తుతం కెరీర్‌ అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న ఈ ఆటగాళ్లు జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని, అందుకే వారిని అర్జున అవార్డుతో సత్కరించాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే వారి పేర్లను  కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

శిఖర్‌ ధావన్‌ ఈ ఐపీఎల్‌ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. సన్‌రైజర్స్‌ తొలి రెండు మ్యాచ్‌లు గెలవడంలో ధావన్‌ పెద్దన్న​పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఇక వరుస హాఫ్‌ సెంచరీలతో చెలరేగిపోయి, ఇంగ్లండ్‌పై టీమిండియా వన్డే సిరీస్‌ గెలవడంలో మహిళా క్రికెటర్‌ స్మృతి మంధాన పాత్ర మరువలేనిది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top