క్వార్టర్స్‌లో సానియా-హింగిస్ జంట | Sania-Hingis team in quarters | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో సానియా-హింగిస్ జంట

Jun 1 2015 2:14 AM | Updated on Sep 3 2017 3:01 AM

మహిళల డబుల్స్ విభాగంలో సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంట క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది.

మహిళల డబుల్స్ విభాగంలో సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంట క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. మూడో రౌండ్‌లో టాప్ సీడ్ సానియా-హింగిస్ ద్వయం 6-1, 6-4తో కరిన్ నాప్-రొబెర్టా విన్సీ (ఇటలీ) జోడీపై గెలిచింది. సరిగ్గా గంటపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా జంట తమ సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయినప్పటికీ ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది.

 పేస్ జంటకు ఓటమి
 పురుషుల డబుల్స్ విభాగంలో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. బరిలో ఉన్న లియాండర్ పేస్ (భారత్)-డానియల్ నెస్టర్ (కెనడా); రోహన్ బోపన్న (భారత్)-ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా) జంటలకు మూడో రౌండ్‌లో పరాజయాలు ఎదురయ్యాయి. ఆరో సీడ్ ఫాబియో ఫాగ్‌నిని-సిమోన్ బోలెలి (ఇటలీ) ద్వయం 6-2, 6-4తో పేస్-నెస్టర్ జంటపై, ఐదో సీడ్ రోజర్ (నెదర్లాండ్స్)-హొరియా టెకావ్ (రుమేనియా) ద్వయం 6-3, 6-7 (7/9), 6-3తో బోపన్న-మెర్జియా జోడీపై గెలిచాయి.

 ప్రాంజలకు నిరాశ
 జూనియర్ బాలికల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల పోరాటం తొలి రౌండ్‌లోనే ముగిసింది. హోరాహోరీగా సాగిన తొలి రౌండ్‌లో ప్రాంజల 6-7 (1/7), 4-6తో ప్రిస్కిల్లా హాన్ (ఆస్ట్రేలియా) చేతిలో పోరాడి ఓడిపోయింది. గంటన్నరపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రాంజల నాలుగు ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. అయితే తన సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోవడంతో పాటు కీలకదశలో తడబాటుకులోనైన ప్రాంజలకు పరాజయం తప్పలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement