♦ శ్రీకాంత్ ఓటమి
♦ ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్
సిడ్నీ : ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీలో స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్ మినహా.. మిగతా వారు నిరాశపర్చారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో రెండోసీడ్ సైనా 21-19, 19-21, 21-14తో సన్ యు (చైనా)పై నెగ్గి క్వార్టర్ఫైనల్లోకి దూసుకెళ్లింది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో నాలుగోసీడ్ శ్రీకాంత్ 21-18, 17-21, 13-21తో టియాన్ హోవోయి (చైనా) చేతిలో ఓడాడు. మహిళల డబుల్స్ లో జ్వాలా-అశ్విని జోడి 14-21, 10-21తో నాలుగోసీడ్ ఇండోనేసియా జంట నిత్య క్రిషిందా మహేశ్వరి-గ్రేసియా పోలీ చేతిలో పరాజయం చవిచూసింది.
సన్ యుతో గంటా 18 నిమిషాల పాటు జరిగిన పోరాటంలో సైనాకు గట్టి ప్రతిఘటనే ఎదురైంది. తొలి గేమ్లో వ్యూహాత్మకంగా ఆడిన హైదరాబాదీ 5-5, 11-6తో ఆధిక్యాన్ని సాధించింది. ఈ దశలో సన్ పుంజుకొని 18-18తో స్కోరును సమం చేసినా సైనా ధాటికి నిలువలేకపోయింది. రెండో గేమ్లో ఆరంభంలో సైనా జోరు కనబర్చినా.. చివర్లో సన్ కట్టడి చేసింది. ఓ దశలో భారత అమ్మాయి 13-7 ఆధిక్యంలో నిలిచినా... సన్ వీరోచితంగా పోరాడుతూ 13-13తో స్కోరును సమం చేసింది.
తర్వాత సైనా 18-15 ఆధిక్యాన్ని సంపాదించినా సన్ ధాటికి వరుసగా పాయింట్లు కోల్పోయింది. నిర్ణయాత్మక మూడో గేమ్లో సన్కు పుంజుకునే అవకాశం ఇవ్వకుండా ఆడినా సైనా 12-4 ఆధిక్యంలో నిలిచింది. తర్వాత స్కోరు సమం చేసేందుకు సన్ చేసిన ప్రయత్నాలను సమర్థంగా తిప్పికొట్టిన హైదరాబాదీ గేమ్తో పాటు మ్యాచ్ను సొంతం చేసుకుంది. శుక్రవారం జరిగే క్వార్టర్స్లో ఐదోసీడ్ షిజియాన్ వాంగ్ (చైనా)తో సైనా తలపడుతుంది.
క్వార్టర్స్లో సైనా
Published Fri, May 29 2015 1:01 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పేమెంట్స్ బ్యాంకులకు ఉజ్వల భవిష్యత్తు!
మేఘాలయలో హిట్లర్ను అరెస్టు చేసిన కెన్నెడీ?
మీ ఆశీర్వాదంతో విజయం సాధిస్తాం
పేదింట విషాదం
నూకాంబిక అమ్మవారి బాలాలయానికి పోటెత్తిన భక్తులు
రమేష్ రౌడీయిజంతో జల్లా ప్రజల్లో భయభ్రాంతులు
ఎన్. గజపతినగరంలో టీడీపీకి గట్టి షాక్
ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపు
జగన్ మళ్లీ సీఎం కావడం తథ్యం
‘చేనేత’ను ఆదుకున్నది జగన్ ప్రభుత్వమే
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- Today Telugu Horoscope: ఈ రాశివారికి పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి
- గుండె ఘోష విన్నారు..
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- నిప్పుతో చెలగాటమా!
- రవీంద్రజాలం... జడేజా ఆల్రౌండ్ షో
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
- జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
Advertisement