ఐసీసీ ఎలైట్ ప్యానెల్‌లో రవి | S Ravi and Chris Gaffaney in Elite Panel | Sakshi
Sakshi News home page

ఐసీసీ ఎలైట్ ప్యానెల్‌లో రవి

Jun 5 2015 12:19 AM | Updated on Sep 3 2017 3:13 AM

ఐసీసీ ఎలైట్ ప్యానెల్‌లో రవి

ఐసీసీ ఎలైట్ ప్యానెల్‌లో రవి

సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ ఎలైట్ ప్యానెల్‌లో ఓ భారత అంపైర్‌కు స్థానం దక్కింది. ఎస్.వెంకట్రాఘవన్ అనంతరం

 దుబాయ్: సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ ఎలైట్ ప్యానెల్‌లో ఓ భారత అంపైర్‌కు స్థానం దక్కింది. ఎస్.వెంకట్రాఘవన్ అనంతరం 11 ఏళ్లుగా ఈ అత్యుత్తమ అంపైర్ల ప్యానెల్‌లో మరో భారతీయుడికి చోటుదక్కలేదు. అయితే తాజాగా సుందరం రవి ఈ ఘనత సాధించారు. అంపైర్లు స్టీవ్ డేవిస్ రిటైర్ కాగా, బిల్లీ బోడెన్ (కివీస్)ను తప్పించడంతో ఇంటర్నేషనల్ ప్యానెల్ నుంచి రవితో పాటు క్రిస్ గఫానే (కివీస్) ఎలైట్ ప్యానెల్‌కు ప్రమోట్ అయ్యారు. ఎలైట్ ప్యానెల్‌లో మొత్తం 12 మంది అంపైర్లుంటారు.  2011 విశాఖపట్నంలో జరిగిన వన్డేతో అంపైర్‌గా అరంగేట్రం చేసిన రవి ఇప్పటిదాకా ఆరు టెస్టులు, 24 వన్డేలు, 12 టి20ల్లో బాధ్యతలు నిర్వర్తించారు. ‘ఐసీసీ ఎలైట్ ప్యానెల్‌లో చోటు దక్కించుకోవడం గౌరవంగా భావిస్తున్నాను. ఈ విషయంలో బీసీసీఐకి, ఐసీసీకి కృతజ్ఞతలు తె లుపుకుంటున్నాను’ అని 49 ఏళ్ల రవి అన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement