విజయానంతరం శ్రీలంక జెండాతో రోహిత్‌! | Rohit Sharma Waves Sri Lankan Flag  | Sakshi
Sakshi News home page

Mar 19 2018 9:50 PM | Updated on Mar 19 2018 10:01 PM

Rohit Sharma Waves Sri Lankan Flag  - Sakshi

సాక్షి, స్పోర్ట్స్‌ : నిదహాస్‌ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన ఉత్కంఠకర మ్యాచ్‌లో విజయానంతరం టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ శ్రీలంక జాతీయ పతాకంతో మైదానంలో సందడి చేశారు. లంక స్వాతంత్ర్య వేడుకల పురస్కరించుకొని ఈ ముక్కోణపు టోర్నీని నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే శ్రీలంకపై బంగ్లాదేశ్‌ అనూహ్య విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో బంగ్లా ఆటగాళ్లు దురుసుగా ప్రవర్తించడంతో లంక అభిమానులు ఫైనల్లో భారత్‌కు మద్దతు పలికారు.

ఈ నేపథ్యంలో రోహిత్‌ విజయానంతరం వారి మద్దతుకు ప్రతీకగా ఆ దేశ జెండాను ఊపుతూ వారిలో ఉత్సహాన్ని నింపారు. దీంతో రోహిత్‌పై లంక అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. క్రికెట్‌కే ఇదొక అందమని, రోహిత్‌ శర్మ శ్రీలంక జెండా పట్టుకోవడం సంతోషంగా ఉందని సోషల్‌ మీడియా వేదికగా కామెంట్స్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement