మళ్లీ ఓడిన టైటాన్స్‌ | Puneri Paltan Beat Telugu Titans | Sakshi
Sakshi News home page

మళ్లీ ఓడిన టైటాన్స్‌

Aug 31 2019 10:17 AM | Updated on Aug 31 2019 10:17 AM

 Puneri Paltan Beat Telugu Titans - Sakshi

న్యూఢిల్లీ: తెలుగు టైటాన్స్‌ది మళ్లీ అదే కథ... అదే వ్యథ! ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) ఏడో సీజన్‌లో ఏరికోరి తెచ్చుకున్న స్టార్‌ రైడర్‌ సిద్ధార్థ్‌ దేశాయ్‌ జట్టులో ఉన్నా టైటాన్స్‌ గతి మారడం లేదు. తాజాగా శుక్రవారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌ 27–34తో పుణేరి పల్టన్‌ చేతిలో పరాజయం చవిచూసింది. తెలుగు జట్టులో రైడర్‌ సిద్ధార్థ్‌ దేశాయ్‌ 7 పాయింట్లు తెచి్చపెట్టాడు. డిఫెండర్లలో సి.అరుణ్‌ 6, విశాల్‌ భరద్వాజ్‌ 5 పాయింట్లు సాధించారు.

పుణేరి తరఫున రైడర్లు మన్‌జీత్‌ (9) నితిన్‌ తోమర్‌ (8) అదరగొట్టారు. డిఫెండర్లలో అమిత్‌ కుమార్, సాగర్‌కృష్ణ చెరో 4 పాయింట్లు సాధించారు. 11 మ్యాచ్‌లాడిన టైటాన్స్‌కిది ఆరో ఓటమి! 12 జట్లు బరిలో ఉన్న ఈ టోరీ్నలో ఇప్పటివరకు మూడే మ్యాచ్‌లు గెలిచిన టైటాన్స్‌ జట్టు పేలవ ప్రదర్శనతో 11వ స్థానంలో ఉంది. అనంతరం జరిగిన రెండో మ్యాచ్‌లో దబంగ్‌ ఢిల్లీ 38–35తో పట్నా పైరేట్స్‌పై విజయం సాధించింది. శనివారం జరిగే తొలి మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్‌తో గుజరాత్‌ ఫార్చూన్‌ జెయింట్స్, యు ముంబాతో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ పోటీపడనుంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement