
యు ముంబా గెలుపు
ప్రొ కబడ్డీ లీగ్లో యు ముంబాకు మరో విజయం దక్కింది. శనివారం ఇక్కడ జరిగిన జోన్ ‘ఎ’ మ్యాచ్లో యు ముంబా 36–22 పాయింట్ల తేడాతో దబంగ్ ఢిల్లీని చిత్తు చేసింది.
నాగపూర్: ప్రొ కబడ్డీ లీగ్లో యు ముంబాకు మరో విజయం దక్కింది. శనివారం ఇక్కడ జరిగిన జోన్ ‘ఎ’ మ్యాచ్లో యు ముంబా 36–22 పాయింట్ల తేడాతో దబంగ్ ఢిల్లీని చిత్తు చేసింది. ముంబా ఆటగాళ్లలో అనూప్ కుమార్, షబీర్ బాపు చెరో 7 పాయింట్లతో చెలరేగారు. ఢిల్లీ తరఫున కెప్టెన్ మిరాజ్ షేక్ 7 పాయింట్లు స్కోర్ చేయగా, నీలేశ్ షిండే 5 పాయింట్లు సాధించాడు. మరో మ్యాచ్లో యూపీ యోధ 32–27 స్కోరుతో బెంగళూరు బుల్స్పై గెలుపొందింది. యూపీ తరఫున నితిన్ తోమర్ 9 పాయింట్లతో దూకుడు కనబర్చగా, రిషాంక్ 5 పాయింట్లు సాధించాడు. బుల్స్ ఆటగాళ్లలో కెప్టెన్ రోహిత్ కుమార్ ఒక్కడే 11 పాయింట్లతో ఎదురు దాడి చేసినా... జట్టును గెలిపించడంలో విఫలమయ్యాడు. ఆదివారం జరిగే బెంగాల్ వారియర్స్తో యూపీ యోధ, బెంగళూరు బుల్స్తో పట్నా పైరేట్స్ తలపడతాయి. ఈ పోటీలను స్టార్ స్పోర్ట్స్–2 ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.