ప్రవీణ్ (101) వీరోచిత సెంచరీతో కదం తొక్కడంతో సెయింట్ సాయి జట్టు 6 వికెట్ల తేడాతో యాదవ్ డెయిరీపై గెలుపొందింది.
సెయింట్ సాయిని గెలిపించిన ప్రవీణ
Aug 6 2013 2:06 AM | Updated on Jul 25 2019 5:24 PM
సాక్షి, హైదరాబాద్:ప్రవీణ్ (101) వీరోచిత సెంచరీతో కదం తొక్కడంతో సెయింట్ సాయి జట్టు 6 వికెట్ల తేడాతో యాదవ్ డెయిరీపై గెలుపొందింది. ఎ-డివిజన్ వన్డే లీగ్లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్కు దిగిన యాదవ్ డెయిరీ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 278 పరుగులు చేసింది. విఘ్నేశ్వర్ (87), అభిషేక్ (76) అర్ధసెంచరీలతో రాణించారు. తర్వాత భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సెయింట్ సాయి జట్టు 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
ప్రవీణ్తో పాటు రాజా (54), జీతు (61) అర్ధసెంచరీలు సాధించారు. మరో మ్యాచ్లో ఎంపీ స్పోర్టింగ్ 111 పరుగుల తేడాతో పీకేసీసీపై గెలుపొందింది. మొదట ఎంపీ స్పోర్టింగ్ 7 వికెట్లకు 306 పరుగుల భారీస్కోరు చేసింది. నవీన్ (76), వినీత్ (82 నాటౌట్) అర్ధసెంచరీలు చేశారు. పీకేసీసీ బౌలర్ విజయ్ 3 వికెట్లు తీశాడు. తర్వాత పీకేసీసీ 195 పరుగులకే కుప్పకూలింది. విజయ్ (55) అర్ధసెంచరీ చేశాడు. ప్రేమ్ 31 పరుగులు చేయగా చైతన్య 4 వికెట్లు పడగొట్టాడు.
ఇతర మ్యాచ్ల స్కోర్లు
సెయింట్ ప్యాట్రిక్స్: 176 (సాత్యకి 89; భరత్ 3/48); సన్షైన్: 166 (కిరణ్ 81; సాత్యకి 4/53)
ఎలెవన్ మాస్టర్స్: 205 (సృజన్ 100 నాటౌట్, ప్రసాద్ 31; వంశీ 5/56), ఆల్ సెయింట్స్: 203/8 (ఇబ్రహీం 38)
నటరాజ్: 122 (హసీబ్ 4/28, జావెద్ 3/28), పీఎన్ యంగ్స్టర్స్: 123/7 (హసీబ్ 34; మణికుమార్ 3/35)
సాక్రెడ్ హార్ట్: 161 (జెరోమ్ అరోకియనధన్ 34, జోసెఫ్ రాయప్ప 32), ఎంపీ బ్లూస్: 107 (జెరోమ్ 3/42).
Advertisement
Advertisement