భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య గాబా మైదానంలో బుధవారం జరుగుతున్న రెండో టెస్ట్లో ఓపెనర్ మురళీ విజయ్ అర్థ సెంచరీ చేశాడు.
బ్రిస్బేన్: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య గాబా మైదానంలో బుధవారం జరుగుతున్న రెండో టెస్ట్లో ఓపెనర్ మురళీ విజయ్ అర్థ సెంచరీ చేశాడు. భోజన విరామం అనంతరం ఆదినుంచి దూకుడుగా ఆడుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించిన అతడు హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మురళీ విజయ్ 54, పుజారా 18 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత్ 33 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి వంద పరుగులు చేసింది. అంతకు ముందు శిఖర్ థావన్ 24 పరుగుల వద్ద ఆసీస్ బౌలర్ మార్ష్ బౌలింగ్లో హడిన్కు క్యాచ్ ఇచ్చి.. అవుట్ అయ్యాడు.