ప్రపంచ చాంపియన్‌షిప్‌కు మనోజ్, కవీందర్, సతీశ్‌ అర్హత | Sakshi
Sakshi News home page

ప్రపంచ చాంపియన్‌షిప్‌కు మనోజ్, కవీందర్, సతీశ్‌ అర్హత

Published Mon, May 8 2017 12:41 AM

ప్రపంచ చాంపియన్‌షిప్‌కు మనోజ్, కవీందర్, సతీశ్‌ అర్హత

తాష్కెంట్‌: అందివచ్చిన ఏకైక అవకాశాన్ని సద్విని యోగం చేసుకున్న భారత బాక్సర్లు మనోజ్‌ కుమార్‌ (69 కేజీలు), సతీశ్‌ కుమార్‌ (ప్లస్‌ 91 కేజీలు), కవీందర్‌ సింగ్‌ బిష్త్‌ (52 కేజీలు) ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌కు అర్హత సాధించారు.

ఆసియా చాంపియన్‌షిప్‌లో భాగంగా చివరి రోజు జరిగిన ‘బాక్స్‌ ఆఫ్‌ బౌట్‌’లలో మనోజ్‌ 3–2తో లియు వీ (చైనా)పై... సతీశ్‌ 5–0తో ము హైపెంగ్‌ (చైనా)పై గెలుపొందగా... కవీందర్‌కు తన ప్రత్యర్థి సలామ్‌ అబ్దుల్‌ (మలేసియా) నుంచి వాకోవర్‌ లభించింది. ఇంతకుముందే శివ థాపా, సుమీత్‌ సాంగ్వాన్, వికాస్‌ కృషన్, అమిత్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌ బెర్త్‌ సాధించారు.

Advertisement
Advertisement