ఇపో (మలేసియా): కొత్త సీజన్లో భారత పురుషుల హాకీ జట్టు తమ జోరు కొనసాగిస్తోంది. సుల్తాన్ అజ్లాన్ షా కప్ టోర్నమెంట్లో టీమిండియా మూడో విజయంతో పసిడి పతకం కోసం జరిగే ఫైనల్ పోరుకు అర్హత సాధించింది. కెనడా జట్టుతో బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్లో భారత్ 7–3 గోల్స్ తేడాతో గెలిచింది. భారత్ తరఫున 24 ఏళ్ల మన్దీప్ సింగ్ (20వ, 27వ, 29వ నిమిషాల్లో) హ్యాట్రిక్ సాధించగా... వరుణ్ కుమార్ (12వ నిమిషంలో), అమిత్ రోహిదాస్ (39వ నిమిషంలో), వివేక్ ప్రసాద్ (55వ నిమిషంలో), నీలకంఠ శర్మ (58వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. కెనడా జట్టుకు మార్క్ పియర్సన్ (35వ నిమిషంలో), ఫిన్ బూత్రాయ్డ్ (50వ నిమిషంలో), జేమ్స్ వాలెస్ (57వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు.
గోల్స్ పరంగా కెనడాపై భారత్కిదే అతి పెద్ద విజయం. ఇప్పటివరకు కెనడాతో 16 మ్యాచ్లు ఆడిన భారత్ 12 మ్యాచ్ల్లో గెలిచి, మూడింటిలో ఓడి, ఒక దానిని ‘డ్రా’ చేసుకుంది. మరో మ్యాచ్లో దక్షిణ కొరియా 2–1తో ఆతిథ్య మలేసియా జట్టును ఓడించింది. గురువారం విశ్రాంతి దినం తర్వాత శుక్రవారం జరిగే చివరి లీగ్ మ్యాచ్లో పోలాండ్తో భారత్ ఆడుతుంది. ఆరు జట్ల మధ్య లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో జరుగుతున్న ఈ టోర్నీలో లీగ్ మ్యాచ్లు పూర్తయ్యాక తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు టైటిల్ కోసం తలపడతాయి.
ప్రస్తుతం భారత్, కొరియా జట్లు 10 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాయి. మిగతా నాలుగు జట్లకు పది పాయింట్లు సాధించే అవకాశం లేకపోవడంతో భారత్, కొరియా జట్లు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఫైనల్కు చేరుకున్నాయి.
గతేడాది సొంతగడ్డపై జరిగిన ప్రపంచకప్లో కెనడాపై 5–1తో నెగ్గిన భారత్ ఈ మ్యాచ్లోనూ కెనడాపై పూర్తి ఆధిపత్యం చలాయించింది. ఆరంభంలోనే వరుణ్ గోల్తో ఖాతా తెరిచిన భారత్ ఆ తర్వాత రెండో క్వార్టర్లో చెలరేగింది. ముఖ్యంగా మన్దీప్ సింగ్ తొమ్మిది నిమిషాల వ్యవధిలో వరుసగా మూడు గోల్స్ చేసి హ్యాట్రిక్ సాధించాడు. ఆ తర్వాత కెనడా ఆటగాళ్లు తేరుకొని ఖాతా తెరిచినా... భారత దూకుడును అడ్డుకోలేకపోయారు. చివరి పది నిమిషాల్లో కెనడా రెండు గోల్స్ చేసినా ఫలితం లేకపోయింది.
పసిడి పోరుకు భారత్
Published Thu, Mar 28 2019 12:40 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బ్లూచిప్స్కు అమ్మకాల షాక్
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement