మలేసియా ఓపెన్‌: సెమీ ఫైనల్లో శ్రీకాంత్‌ | Sakshi
Sakshi News home page

మలేసియా ఓపెన్‌: సెమీ ఫైనల్లో శ్రీకాంత్‌

Published Fri, Jun 29 2018 4:59 PM

Kidambi Srikanth Beats Brice Leverdez To Reach Semi Finals - Sakshi

కౌలాలంపూర్‌: మలేసియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–750 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్‌ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌ సెమీ ఫైనల్లోకి ప్రవేశించాడు. శుక‍్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో శ్రీకాంత్‌ 21-18, 21-14 తేడాతో బ్రైస్‌ లీవర్‌డెజ్‌(ఫ్రెంచ్‌)పై గెలిచి సెమీ ఫైనల్‌ బెర్తును ఖాయం చేసుకున్నాడు. ఏకపక్షంగా సాగిన పోరులో శ్రీకాంత్‌ ఆద్యంతం ఆకట్టుకున్నాడు. తొలి గేమ్‌ను కష్టపడి గెలిచిన శ్రీకాంత్‌.. రెండో గేమ్‌ను సునాయాసంగా చేజిక్కించుకున్నాడు.

తొలి గేమ్‌లో శ్రీకాంత్‌ 18-20 తో వెనుకబడిన దశలో తిరిగి పుంజుకున్నాడు. వరుసగా రెండు గేమ్‌ పాయింట్లను సాధించి స్కోరును సమం చేశాడు. ఆ తర్వాత లీవర్‌డెజ్‌కు మరో అవకాశం ఇవ్వకుండా గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. ఇక రెండో గేమ్‌లో శ్రీకాంత్‌ 10-1 తేడాతో దూసుకుపోయాడు. ఆ దశలో ప్రత్యర్థి నుంచి ప్రతి ఘటన ఎదురైనప్పటికీ శ్రీకాంత్‌ నిలదొక్కుకుని విజయం సాధించాడు.

Advertisement
Advertisement