టోక్యో ఒలింపిక్స్‌కు శివ్‌పాల్‌ సింగ్‌ అర్హత 

Javelin Thrower Shivpal Singh Qualifies For Tokyo Olympics - Sakshi

పాచెఫ్‌స్ట్రూమ్‌: భారత జావెలియన్‌ త్రోయర్‌ శివ్‌పాల్‌ సింగ్‌ టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. దక్షిణాఫ్రికాలో జరిగిన ఏసీఎన్‌డబ్ల్యూ అథ్లెటిక్స్‌ మీట్‌లో శివ్‌పాల్‌ సింగ్‌ ఈటెను 85.47 మీటర్ల దూరం విసిరి విజేతగా నిలిచాడు. ఈ క్రమంలో టోక్యో ఒలింపిక్స్‌ అర్హత ప్రమాణం 85 మీటర్లను కూడా శివ్‌పాల్‌ సింగ్‌ అధిగమించాడు. భారత్‌ తరఫున టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత పొందిన రెండో జావెలియన్‌ త్రోయర్‌ శివ్‌పాల్‌ సింగ్‌. ఇప్పటికే నీరజ్‌ చోప్రా ‘టోక్యో’ బెర్త్‌ సాధించాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top