భారత్‌ జయకేతనం | india wins second T20 held in nagpur | Sakshi
Sakshi News home page

భారత్‌ జయకేతనం

Jan 29 2017 10:35 PM | Updated on Sep 5 2017 2:25 AM

భారత్‌ జయకేతనం

భారత్‌ జయకేతనం

భారత్‌-ఇంగ్లండ్‌ల మధ్య జరిగిన రెండో టీ20లో భారత్‌ గెలిచింది.

నాగపూర్: భారత్‌-ఇంగ్లండ్‌ల మధ్య జరిగిన రెండో టీ20లో భారత్‌ గెలిచింది.  చివరి వరకూ ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో కోహ్లసేన 5 పరుగుల తేడాతో విజయపతాకాన్ని ఎగురవేసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ ఇరవై ఓవర్లలో 144-8 పరుగులు చేసింది. ఆ తర్వాత బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ జట్టు 139 పరుగులు చేసి ఓటమి పాలైంది. మూడు టీ20ల సిరీస్‌ 1-1 తేడాతో సమమైంది. ఫిబ్రవరి 1న జరగబోయే ఆఖరి మ్యాచ్‌లో సిరీస్ విజేత ఎవరో తేలనుంది.
 
ఇంగ్లండ్ జట్టు చివరి ఓవర్‌లో 8 పరుగులు చేయాల్సి ఉండగా భారత బౌలర్ బూమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మొదటి, నాలుగో బంతుల్లో వికెట్లు తీశాడు. చివరి బంతికి 6 పరుగులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. నిజానికి మూడు ఓవర్లలో 27 పరుగులు చేయాల్సి సమయంలో బూమ్రా 18వ ఓవర్ వేసిన బూమ్రా 3 పరుగులు మాత్రమే ఇచ్చాడు. తర్వాత ఓవర్ వేసిన నెహ్రా 12 పరుగులు ఇచ్చాడు. అయితే చివరి ఓవర్‌ను వేసిన బూమ్రా తన బౌలింగ్‌తో మ్యాజిక్ చేసి మ్యాచ్ గెలిపించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement