లంక బౌలర్లను ఆటాడుకున్న ధావన్, పుజారా | India scores 399 lose of 3 wickets against sri lanka | Sakshi
Sakshi News home page

లంక బౌలర్లను ఆటాడుకున్న ధావన్, పుజారా

Jul 26 2017 6:36 PM | Updated on Sep 5 2017 4:56 PM

లంక బౌలర్లను ఆటాడుకున్న ధావన్, పుజారా

లంక బౌలర్లను ఆటాడుకున్న ధావన్, పుజారా

శ్రీలంకతో జరుగుతున్న గాలే టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో తొలిరోజు టీమిండియా ఆధిపత్యం చెలాయించింది.

గాలె: శ్రీలంకతో జరుగుతున్న గాలే టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో తొలిరోజు టీమిండియా ఆధిపత్యం చెలాయించింది. శిఖర్ ధావన్, చతేశ్వర్ పుజారా భారీ శతకాలతో రాణించడంతో తొలిరోజు ఆట నిలిపివేసే సమయానికి విరాట్ కోహ్లీ సేన 3 వికెట్లు కోల్పోయి 399 పరుగులు చేసింది. టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ (168 బంతుల్లో 190; 31 ఫోర్లు) విధ్వంసం సృష్టిస్తూ భారీ ఇన్నింగ్స్ ఆడినా తృటిలో డబుల్ సంచరీ చేజార్చుకున్నాడు.

వన్ డౌన్ ఆటగాడు చతేశ్వర్ పుజారా లంక బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొన్నాడు. ఆచితూచి ఆడుతూ చెత్త బంతులను బౌండరీలకు తరలించాడు. ఈ క్రమంలో 173 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో పుజారా సెంచరీ చేశాడు. పుజారా కెరీర్ లో ఇది 12వ సెంచరీ. తొలి రోజు ఆట నిలిపివేసే సమయానికి పుజారా (144 నాటౌట్; 247 బంతుల్లో 12 ఫోర్లు), వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానె (39 నాటౌట్; 94 బంతుల్లో 1 ఫోర్) క్రీజులో ఉన్నారు. ఓపెనర్ ముకుంద్ (12), కెప్టెన్ విరాట్ కోహ్లీ(3) స్వల్ప స్కోర్లకే పెవిలియన్ బాట పట్టారు. లంక బౌలర్ ప్రదీప్ కే ఈ మూడు వికెట్లు దక్కాయి. రహానే, పుజారా రెండోరోజు సాధ్యమైనంత ఎక్కువ ఓవర్లు ఆడితే భారత్ సులువుగా భారీ స్కోరు చేసి డిక్లేర్ ఇచ్చే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement