పడిపోయిన టీమిండియా ర్యాంకు | India drop to 5th spot in T20I rankings | Sakshi
Sakshi News home page

పడిపోయిన టీమిండియా ర్యాంకు

May 3 2019 7:05 PM | Updated on May 3 2019 10:39 PM

India drop to 5th spot in T20I rankings - Sakshi

న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) విడుదల చేసిన వార్షిక టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా ర్యాంకు మరింత పడిపోయింది. మూడు స్థానాలు కిందకు పడిపోయి ఐదో స్థానానికి పరిమితమైంది. ప్రస్తుతం 260 రేటింగ్‌ పాయింట్లతో టీమిండియా ఐదో స్థానంలో ఉండగా, దక్షిణాఫ్రికా(262 రేటింగ్‌ పాయింట్లు) రెండో స్థానంలో ఇంగ్లండ్‌(261) మూడో స్థానంలో ఉన్నాయి. అయితే ఆసీస్‌ కూడా 261 పాయింట్లతో ఉన్న స్వల్ప తేడాతో నాల్గో స్థానంలో నిలిచింది.

కాగా, పాకిస్తాన్‌(286 రేటింగ్‌ పాయింట్లు) అగ్రస్థానాన్ని నిలబెట్టకుంది. తాజా ర్యాంకుల గణనలో 2015–16 సీజన్‌ ప్రదర్శనను తొలగించి, 2016–17, 2017–18 సీజన్‌ల ప్రదర్శనకు 50 శాతం వెయిటేజీ ఇచ్చారు. ఇక్కడ అఫ్గానిస్తాన్‌, శ్రీలంక జట్లు ఒక స్థానాన్ని మెరుగుపరుచుకుని వరుసగా ఏడు, ఎనిమిది స్థానాల్లో నిలవగా, వెస్టిండీస్‌ తొమ్మిదో స్థానానికి పడిపోయింది. ఇక నేపాల్‌ 14వ స్థానం నుంచి 11వ స్థానానికి ఎగబాకింది.  నిన్న ప్రకటించిన వార్షిక టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా టాప్‌లో నిలవగా, వన్డేల్లో రెండో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement