సెమీస్‌లో హైదరాబాద్, ఆంధ్ర జట్లు | hyderabad team entered in semifinals | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో హైదరాబాద్, ఆంధ్ర జట్లు

Dec 22 2013 2:57 AM | Updated on Sep 4 2018 5:07 PM

కేరళ క్రీడాకారిణిని నిలువరిస్తున్న ఆంధ్ర జట్టు - Sakshi

కేరళ క్రీడాకారిణిని నిలువరిస్తున్న ఆంధ్ర జట్టు

జాతీయ సీనియర్ కబడ్డీ చాంపియన్‌షిప్ (సౌత్ జోన్)లో హైదరాబాద్, ఆంధ్ర జట్లు సెమీ ఫైనల్లోకి ప్రవేశించాయి.

సాక్షి, హైదరాబాద్: జాతీయ సీనియర్ కబడ్డీ చాంపియన్‌షిప్ (సౌత్ జోన్)లో హైదరాబాద్, ఆంధ్ర జట్లు సెమీ ఫైనల్లోకి ప్రవేశించాయి. ఇక్కడి సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న ఈ పోటీల్లో పురుషుల విభాగంలో హైదరాబాద్, మహిళల విభాగంలో ఆంధ్ర జట్టు సెమీస్ చేరుకున్నాయి.
 
 ఈ పోటీల్లో రెండో రోజు శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు 33-25 స్కోరుతో కేరళ జట్టుపై విజయం సాధించి సెమీస్‌కు చేరింది.  హైదరాబాద్ జట్టులో మహేందర్‌రెడ్డి, మల్లేష్ రాణించారు. మహిళల విభాగంలో ఆంధ్ర 39-36తో కేరళను చిత్తు చేసింది. ఫలితంగా లీగ్‌లో వరుసగా రెండో విజయంతో సెమీస్ స్థానం దక్కించుకుంది. పురుషుల విభాగంలో హైదరాబాద్‌తో పాటు తమిళనాడు, కర్ణాటక, సర్వీసెస్...మహిళల విభాగంలో ఆంధ్రతో పాటు తమిళనాడు, కర్ణాటక, పాండిచ్చేరి జట్లు సెమీస్‌కి చేరాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement