జింఖానా సందడి సందడిగా | cricket josh in gymkhana ground | Sakshi
Sakshi News home page

జింఖానా సందడి సందడిగా

Feb 6 2017 8:10 AM | Updated on Sep 5 2017 3:03 AM

జింఖానా సందడి సందడిగా

జింఖానా సందడి సందడిగా

చాలా కాలం తర్వాత జింఖానా మైదానంలో కళ కనిపించింది.

సాక్షి, హైదరాబాద్: చాలా కాలం తర్వాత జింఖానా మైదానంలో కళ కనిపించింది. అంతర్జాతీయ మ్యాచ్‌లే కాకుండా రంజీ ట్రోఫీ మ్యాచ్‌లు కూడా చాలా వరకు ఉప్పల్ స్టేడియానికే పరిమితం అవుతుండటంతో జింఖానాలో ప్రధాన మ్యాచ్‌లు కూడా ఏవీ జరగడం లేదు. సరిగ్గా రెండేళ్ల క్రితం ఇక్కడ రంజీ మ్యాచ్ జరిగాక ఎక్కువ సార్లు అండర్-19, అండర్-23 స్థాయి పోటీలకే ఈ గ్రౌండ్ పరిమితమైంది. ఇప్పుడు చాలా రోజుల తర్వాత పెద్ద సంఖ్యలో క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్‌ను చూసేందుకు వచ్చారు. స్టార్ ఆటగాళ్లు లేకపోయినా కొన్ని తెలిసిన పేర్లు ఉన్న అంతర్జాతీయ జట్టు మ్యాచ్ ఆడుతుండటమే అందుకు కారణం.

 

ఎన్ని ఏళ్లు గడిచినా మారని తరహాలో పాత రోజుల్లాగే జనమంతా బౌండరీ బయట ఇనుప ఫెన్సింగ్ వెనక నిలబడి ఆటపై తమ ఆసక్తిని ప్రదర్శించారు. బంగ్లాదేశ్ బ్యాటింగ్ సమయంలో ప్రేక్షకుల నుంచి తమీమ్, ముష్ఫికర్ పేర్లు ఎక్కువగా వినిపించాయి. భారత జట్టు సభ్యులైన హార్దిక్ పాండ్యా, జయంత్ బౌలింగ్, పంత్ కీపింగ్ చేస్తున్న సమయంలో కూడా వారు బాగా ప్రోత్సహించారు. భారత జట్టు బ్యాటింగ్ సమయంలో తొలి వికెట్ పడిన తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన ఆటగాడి పేరు స్కోరుబోర్డుపై పొరపాటున హార్దిక్ పాండ్యాగా పడింది. దాంతో పాండ్యా సిక్సర్, సిక్సర్ అంటూ వారంతా పెద్దగా అరిచారు. అయితే బ్యాటింగ్‌కు వచ్చింది శ్రేయస్ అని గుర్తించేందుకు కాస్త సమయం పట్టింది. మరోవైపు సివిల్ సప్లయిస్ విభాగం కమిషనర్ సీవీ ఆనంద్... తమ కుమారుడు మిలింద్ బౌలింగ్‌ను ఆసాంతం చూస్తూ ఆట ముగిసే దాకా గ్రౌండ్‌లోనే ఉన్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement