25 ఓవర్లలో ఆస్ట్రేలియా 124/2 | australia reaches 124/2 in 25 overs | Sakshi
Sakshi News home page

25 ఓవర్లలో ఆస్ట్రేలియా 124/2

Jan 18 2015 3:02 PM | Updated on Sep 2 2017 7:52 PM

25 ఓవర్లలో ఆస్ట్రేలియా 124/2

25 ఓవర్లలో ఆస్ట్రేలియా 124/2

ముక్కోణపు సిరీస్లో భాగంగా ఆదివారం జరుగుతున్న తొలి మ్యాచ్లో ఆసీస్ 25 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది.

మెల్బోర్న్: భారత్తో మ్యాచ్లో ఆస్ట్రేలియా విజయం దిశగా దూసుకెళ్తోంది. ఆస్ట్రేలియాను కట్టడి చేయడంలో భారత బౌలర్లు తేలిపోతున్నారు. ముక్కోణపు సిరీస్లో భాగంగా ఆదివారం జరుగుతున్న మ్యాచ్లో ఆసీస్ 25 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. ఫించ్ (53) హాఫ్ సెంచరీ చేశాడు.

268 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఆసీస్ స్కోరు 51 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. భారత్  పేసర్ ఉమేష్ యాదవ్.. వార్నర్ను అవుట్ చేశాడు. వార్నర్.. రైనాకు క్యాచిచ్చాడు. 115 పరుగుల వద్ద అక్షర్ పటేల్.. వాట్సన్ (41)ను బౌల్డ్ చేశాడు.  

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన భారత్..  ఓపెనర్ రోహిత్ శర్మ(138) సెంచరీ, రైనా (51) హాఫ్ సెంచరీ చేయడంతో నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 267 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఆరు వికెట్లు తీసి భారత్ను కట్టడి చేశాడు. రోహిత్, రైనా మినహా ఇతర భారత బ్యాట్స్మెన్ పరుగుల వేటలో విఫలమయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement