
ముక్కోణపు సిరీస్: 100 స్కోరు దాటిన ఆసీస్
ముక్కోణపు సిరీస్లో భాగంగా ఆదివారం జరుగుతున్న తొలి మ్యాచ్లో ఆసీస్ 19 ఓవర్లలో వికెట్ నష్టానికి వంద పరుగులు చేసింది.
మెల్బోర్న్: ఆస్ట్రేలియాను కట్టడి చేయడంలో భారత బౌలర్లు తేలిపోతున్నారు. ముక్కోణపు సిరీస్లో భాగంగా ఆదివారం జరుగుతున్న మ్యాచ్లో ఆసీస్ 19 ఓవర్లలో వికెట్ నష్టానికి వంద పరుగులు చేసింది. ఫించ్ (34), వాట్సన్ (38) బ్యాటింగ్ చేస్తున్నారు.
268 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఆసీస్ స్కోరు 51 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. భారత్ పేసర్ ఉమేష్ యాదవ్.. వార్నర్ను అవుట్ చేశాడు. వార్నర్.. రైనాకు క్యాచిచ్చాడు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన భారత్.. ఓపెనర్ రోహిత్ శర్మ(138) సెంచరీ, రైనా (51) హాఫ్ సెంచరీ చేయడంతో నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 267 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఆరు వికెట్లు తీసి భారత్ను కట్టడి చేశాడు. రోహిత్, రైనా మినహా ఇతర భారత బ్యాట్స్మెన్ పరుగుల వేటలో విఫలమయ్యారు.