ఫైనల్లో ఆస్ట్రేలియా

Australia cruise into tri-series final - Sakshi

ముక్కోణపు టి20 టోర్నీ

మెల్‌బోర్న్‌: సమష్టి ఆటతీరు కనబరుస్తున్న ఆస్ట్రేలియా ముక్కోణపు టి20 టోర్నీలో తమ జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి... మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే ఫైనల్‌కు చేరింది. శనివారం ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టి20లో ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత ఇంగ్లండ్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. రిచర్డ్‌సన్‌ (3/33), స్టాన్‌లేక్‌ (2/28) ధాటికి నిలవలేక తక్కువ స్కోరుకే పరిమితమైంది. కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ (49 బంతుల్లో 46; 3 ఫోర్లు) బిల్లింగ్స్‌ (23 బంతుల్లో 29; 4 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు.

అనంతరం బరిలోకి దిగిన ఆసీస్‌ మ్యాక్స్‌వెల్‌ (26 బంతుల్లో 39; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), షార్ట్‌ (36 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌), క్రిస్‌ లిన్‌ (19 బంతుల్లో 31; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఫించ్‌ (5 బంతుల్లో 20 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) తలో చేయి వేయడంతో 14.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసింది. ముక్కోణపు టోర్నీలో భాగంగా తొలి మూడు మ్యాచ్‌లు ఆస్ట్రేలియాలో జరగ్గా... మిగతా మూడు మ్యాచ్‌లతోపాటు ఫైనల్‌కు న్యూజిలాండ్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. మంగళవారం వెల్లింగ్టన్‌లో జరిగే మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో న్యూజిలాండ్‌ ఆడుతుంది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top