గోవా చేతిలో ఆంధ్ర చిత్తు | Andhra team lost game with gova team in ranji trophy | Sakshi
Sakshi News home page

గోవా చేతిలో ఆంధ్ర చిత్తు

Jan 2 2014 1:15 AM | Updated on Jun 2 2018 5:38 PM

రంజీ ట్రోఫీ సీజన్‌ను ఆంధ్ర జట్టు పరాజయంతో ముగించింది. బుధవారం మూడు రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో గోవా 8 వికెట్ల తేడాతో ఆంధ్రను చిత్తు చేసింది.

పోర్వోరిమ్: రంజీ ట్రోఫీ సీజన్‌ను ఆంధ్ర జట్టు పరాజయంతో ముగించింది. బుధవారం మూడు రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో గోవా 8 వికెట్ల తేడాతో ఆంధ్రను చిత్తు చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 32/3తో మూడో రోజు ఆట ప్రారంభించిన ఆంధ్ర తమ రెండో ఇన్నింగ్స్‌లో 160 పరుగులకే ఆలౌటైంది.
 
 ఎం. శ్రీరామ్ 34, శివకుమార్ 26 నాటౌట్, సుధాకర్ 24 పరుగులు చేశారు. గోవా బౌలర్లలో గడేకర్ 28 పరుగులిచ్చి 4 వికెట్లు తీయగా, జకాతి, అమిత్ యాదవ్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం 42 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గోవా 15 ఓవర్లలో 2 వికెట్లకు 43 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. 2013-14 సీజన్‌లో ఆడిన 8 మ్యాచుల్లో ఆంధ్ర ఒకటి మ్యాచ్‌లో విజయం సాధించగా, రెండింటిలో ఓడింది. మిగతా 5 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. త్రిపురపై గెలిచిన ఆంధ్ర జమ్మూ కాశ్మీర్, గోవా చేతుల్లో ఓడింది. ఈ ఏడాది క్వార్టర్ ఫైనల్ చేరుకోలేకపోయిన జట్టు, వచ్చే సీజన్‌లో కూడా గ్రూప్ ‘సి’లోనే ఆడాల్సి ఉంటుంది.
 
 పంజాబ్, బెంగాల్ గెలుపు
 చెన్నై: చివరి వరకు ఆసక్తికరంగా సాగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో బెంగాల్ 4 పరుగుల తేడాతో తమిళనాడును ఓడించింది. 185 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ రెండో రోజు ముగిసే సరికి 102/1తో పటిష్టంగా కనిపించిన తమిళనాడు బుధవారం ఒక్కసారిగా కుప్పకూలింది. స్పిన్నర్ సౌరాశిష్ లాహిరి (7/62) చెలరేగడంతో తమిళనాడు రెండో ఇన్నింగ్స్‌లో 180 పరుగులకు ఆలౌటైంది. ధన్‌బాద్‌లో జార్ఖండ్‌తో జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో పంజాబ్ ఇన్నింగ్స్, 173 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement