ఆనంద్‌కు తొమ్మిదో స్థానం | Anand to the ninth position | Sakshi
Sakshi News home page

ఆనంద్‌కు తొమ్మిదో స్థానం

Sep 3 2015 12:43 AM | Updated on Sep 3 2017 8:37 AM

సింక్యూ ఫీల్డ్ కప్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్‌కు తొమ్మిదో .....

సెయింట్ లూయిస్ (అమెరికా): సింక్యూ ఫీల్డ్ కప్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్‌కు తొమ్మిదో స్థానం లభించింది. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన ఈ టోర్నమెంట్‌లో ఆనంద్ వరుసగా ఏడో ‘డ్రా’ నమోదు చేశాడు.

చివరిదైన తొమ్మిదో రౌండ్‌లో ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్ (నార్వే)తో ఆడిన ఆనంద్ 36 ఎత్తుల్లో గేమ్‌ను ‘డ్రా’గా ముగించాడు. మొత్తం 10 మంది గ్రాండ్‌మాస్టర్లు తలపడిన ఈ టోర్నీలో ఓవరాల్‌గా ఆనంద్ 3.5 పాయింట్లతో తొమ్మిదో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఆరు పాయింట్లతో లెవాన్ అరోనియన్ (ఆర్మేనియా) విజేతగా అవతరించగా... ఐదు పాయింట్లతో కార్ల్‌సన్ రన్నరప్‌గా నిలిచాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement