స్పీకర్‌ను కలువనున్న వైఎస్సార్‌సీపీ ఎంపీలు | YSRCP MPs To Meet Speaker Sumitra Mahajan Over Resignations | Sakshi
Sakshi News home page

స్పీకర్‌ను కలువనున్న వైఎస్సార్‌సీపీ ఎంపీలు

May 29 2018 11:32 AM | Updated on Mar 9 2019 3:59 PM

YSRCP MPs To Meet Speaker Sumitra Mahajan Over Resignations - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ను కలువనున్నారు. మంగళవారం సాయంత్రం 5 గంటలకు స్పీకర్‌ను కలిసి తమ రాజీనామాలను తక్షణమే ఆమోదించాలని కోరనున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కంటే పదవులు ముఖ్యం కాదని వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఇప్పటికే స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా సాధన పోరాటంలో భాగంగా ఏప్రిల్‌ 6న స్పీకర్‌ ఫార్మాట్‌లో ఎంపీలు రాజీనామాలు చేశారు. మరో వైపు స్పీకర్‌తో భేటి కానున్న నేపథ్యంలో ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి నివాసంలో ఈ రోజు మధ్యాహ్నం ఎంపీలంతా సమావేశమవుతారు. 

బాబు అవకాశవాది
ఈ సందర్భంగా మేకపాటి రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. స్పీకర్‌ను కలిసి రాజీనామాలు ఆమోదించాలని కోరుతాం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం దేనికైనా సిద్ధం. టీడీపీ ఎంపీలతో రాజీనామాలు చేయించడానికి చంద్రబాబుకు భయం. ఉపఎన్నికలంటే జంకుతున్నారు. ఓటుకు నోటు కేసు, ఆర్థిక అవకతవకల కేసులతో చంద్రబాబుకు వణుకుపుడుతోంది. వైఎస్‌ జగన్ పాదయాత్రకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. రాహుల్ గాంధీతో కలవడానికైనా, మళ్ళీ మోదీతో జతకట్టడానికైనా బాబు వెనుకాడరు. చంద్రబాబు విలువలు లేని పచ్చి అవకాశవాది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement