‘వైఎస్‌ జగన్‌ పాదయాత్రకు 40ఏళ్ల అనుభవం విలవిల’ | YSRCP Leader Mahammad Iqbal Slams Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

‘వైఎస్‌ జగన్‌ పాదయాత్రకు 40ఏళ్ల అనుభవం విలవిల’

Jun 24 2018 12:41 PM | Updated on Aug 20 2018 6:07 PM

YSRCP Leader Mahammad Iqbal Slams Chandrababu Naidu - Sakshi

సాక్షి, విజయవాడ : వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాదయాత్ర జోరుకు 40 ఏళ్ల చంద్రబాబు నాయుడు అనుభవం విలవిలలాడుతోందని ఆ పార్టీ నేత, రిటైర్డ్‌ ఐజీ మహ్మద్‌ ఇక్బాల్‌ అన్నారు. అనుభవం ఉన్న రాక్షస మూకలకు పట్టం కట్టామని, అనవసరంగా టీడీపీ నేతలకు ఓట్లేసి గెలిపించామని ఏపీ ప్రజలు వాపోతున్నారని తెలిపారు. ఇక్కడి వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయంలో ఆదివారం ఇక్బాల్‌ మీడియాతో మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై టీడీపీ సర్కార్‌ను ప్రశ్నించారు. 2014 ఎన్నికల నేపథ్యంలో ఒక్క బీసీ సామాజిక వర్గానికే చంద్రబాబు 110 హామీలు ఇచ్చారని.. వాటిలో ఏ ఒక్కటీ అమలు చేయలేదంటూ మండిపడ్డారు. అవినీతిలో టీడీపీ నేతలు డైనోసర్లు అని విమర్శించారు.

సింగపూర్ లాంటి విదేశీ కంపెనీలకు రాజధానిని తాకట్టు పెట్టారని టీడీపీ సర్కార్‌ తీరును తప్పుపట్టారు. తెలుగుదేశం పార్టీకి, రాష్ట్ర ప్రభుత్వానికి తేడా లేకుండా చంద్రబాబు మాట్లాడుతున్నారని గుర్తుచేశారు. జీతాలు పెంచాం, ఓట్లు వేయాలని అంగన్‌వాడీలను ఎలా అడుగుతారని ఇక్బాల్ ప్రశ్నించారు. ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాల్లో ఓట్లు అడిగిన టీడీపీ సర్కార్‌ను బర్తరఫ్‌ చేయాలని కోరారు. సీఎం చంద్రబాబు చర్యలు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమన్నారు. ద్వంద్వ పాలనా, కుట్ర రాజకీయాలు చేసి ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ఇప్పుడూ అదే తరహా రాజీకీయాలు చేస్తున్నారని ఇటీవల ఏపీ సీఎంను ఇక్బాల్‌ విమర్శించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement