సాక్షి, హైదరాబాద్/అనంతపురం: రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరుకు నిరసనగా అనంతపురంలోని టవర్క్లాక్ సమీపంలో ఉన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జూలై 2వ తేదీన ‘వంచనపై గర్జన దీక్ష’ నిర్వహించనున్నట్లు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 30న జరగాల్సిన ఈ దీక్షను వచ్చే నెల రెండుకు వాయిదా వేసినట్లు ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 వరకు జరిగే ఈ దీక్షలో.. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంపీ పదవులకు సైతం రాజీనామా చేసిన నేతలతో పాటు వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలు, పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, ముఖ్య నేతలు పాల్గొంటారని తెలిపారు. దీక్షలో పాల్గొనే నేతలంతా ఆ రోజున తప్పనిసరిగా నల్లదుస్తులు ధరించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రజల్ని టీడీపీ, బీజేపీ దగా చేశాయి..
రాష్ట్ర ప్రజల్ని టీడీపీ, బీజేపీ దగా చేశాయని మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ నేత అనంత వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. టీడీపీ, బీజేపీల తీరుకు నిరసనగా అనంతపురంలో చేపడుతున్న వంచనపై గర్జన దీక్షను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం అనంతపురం జిల్లా పార్టీ కార్యాలయంలో మాలగుండ్ల శంకరనారాయణతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీపై పోరాడి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తామని చంద్రబాబు ఇప్పుడు చెబుతున్నారని.. మరి నాలుగేళ్లు కేంద్రంలో ఉండి ఏం చేశారని ఆయన నిలదీశారు.
పోలవరం నిర్మాణం కోసం కేంద్రం ఇచ్చిన నిధులను కాజేశారని బీజేపీ నేతలు విమర్శిస్తున్నా సీఎం ఎందుకు జవాబు చెప్పట్లేదని ప్రశ్నించారు. దివంగత వైఎస్సార్ వల్లే పోలవరాన్ని అప్పటి కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్ట్గా ప్రకటించిందని గుర్తు చేశారు. ఈ నిజాన్ని ఇప్పటికైనా బాబు ఒప్పుకున్నారని.. అవినీతిపై తాము చేసిన ఆరోపణలను కూడా భవిష్యత్లో ఒప్పుకోక తప్పదన్నారు.
2న వంచనపై గర్జన దీక్ష
Published Wed, Jun 27 2018 3:55 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అమెరికా వరల్డ్కప్ జట్టులో ఐదుగురు భారత సంతతి ఆటగాళ్లు..
చావ్లా అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో రెండో బౌలర్గా
గుడిలో సింపుల్గా పెళ్లి చేసుకున్న నటుడి కూతురు (ఫోటోలు)
పార్టీ ఆఫీసులో రాహుల్ గాంధీ పూజలు - వీడియో వైరల్
వెంకటేశ్ అయ్యర్ అద్భుత పోరాటం.. ముంబై టార్గెట్ ఎంతంటే?
సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇలా..
పిల్లల్ని ఎందుకు కనలేదో తొలిసారి చెప్పిన వితికా
ధనుష్తో విడిపోయిన ఐశ్వర్య.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)
సొంతగూటికి సంజయ్ నిరుపమ్
అమిత్షాపై కోడ్ ఉల్లంఘన కేసు
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement