ఆయన పత్తిగింజని నమ్మించడానికి ఏ స్థాయికైనా..!

Vijaya Sai Reddy Slams Chandrababu Naidu And Yellow Media - Sakshi

సాక్షి, అమరావతి: ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆదాయపు పన్ను శాఖ అధికారులు టీడీపీ అధినేత పీఏపై ఇటీవల జరిగిన ఐటీ దాడుల్లో రూ.2 వేల కోట్ల బాగోతం బయటపడిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చంద్రబాబును ఉద్ధేశించి ట్విటర్‌ వేదికగా ఎంపీ విమర్శలు ఎక్కుపెట్టారు. 'చంద్రబాబు పత్తిగింజ అని నమ్మించడానికి పచ్చ మీడియా కిందా మీదా పడుతోంది. ఇన్ కంటాక్స్ కమిషనర్ సురభి అహ్లూవాలియాను కూడా దూషించే స్థాయికి వెళ్లి పోయింది. 2,000 కోట్ల అక్రమ లావాదేవీలను గుర్తిస్తే.. కాదు రెండు లక్షల నగదు మాత్రమే దొరికిందని అబద్ధపు ప్రచారం మొదలు పెట్టింది' అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు. 

కాగా మరో ట్వీట్‌లో.. 'వెట్టి చాకిరి నిర్మూలన చట్టం 1976లోనే వచ్చినా ప్యాకేజీ స్టార్ లాంటి వాళ్లు బానిస సంకెళ్ల నుంచి బయటపడలేక పోతున్నారు. జనం నవ్వుకుంటారన్న ఇంగితం లేకుండా యజమానిని సమర్థిస్తున్నాడు. పిఎస్ శ్రీనివాస్ అవినీతిని ప్రశ్నించే నైతిక హక్కు ఎవరికీ లేదట. కట్టప్పను మించి పోయాడు' అంటూ పవన్‌ కల్యాణ్‌పై విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

చదవండి: చంద్రబాబు  ‘పాస్ వర్డ్’ వదిలేశాడు...

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top