నయీమ్‌ సొమ్ము ఏమైంది?: వీహెచ్‌

V.Hanamantha Rao questioned the crores of rupees that were found after the Nayem encounter. - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌ ఎన్‌కౌంటర్‌ తర్వాత దొరికిన కోట్లాది రూపాయలు ఏమయ్యాయని ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు(వీహెచ్‌) ప్రశ్నించారు. గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ నయీమ్‌ కేసుపై తాను గతంలోనే సిట్‌ అధికారులకు, రాజ్‌నాథ్‌కు ఫిర్యాదు చేశానని గుర్తు చేశారు. కానీ, ఇంతవరకు ఏ చర్యలు చేపట్టలేదని, కేసును ప్రభుత్వం కావాలనే నీరుగార్చుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో జరిగిన కుంభకోణాలన్నింటిలో కేసీఆర్‌ కుటుంబసభ్యుల పాత్ర ఉండటంతోనే ఇంతవరకు ఏ చర్యలు తీసుకోలేదని ఆరోపించారు

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top