టీడీపీపీ భేటీకి కేంద్ర మంత్రి అశోక్‌ డుమ్మా

TDP MP ashok ganapathiraju not attend to tdpp meeting - Sakshi

సీఎం చంద్రబాబుతో గజపతికి పొసగట్లేదని ప్రచారం

సాక్షి, అమరావతి : అత్యంత కీలకమైన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ (టీడీపీపీ) సమావేశానికి ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు, కేంద్ర మంత్రి అశోక్‌ గజపతిరాజు గైర్హాజరవడం చర్చనీయాంశమైంది. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి సరైన కేటాయింపులు లేవంటూ సీఎం చంద్రబాబునాయుడు, ఆ పార్టీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో జరిగిన సమావేశానికి కేంద్ర మంత్రి అశోక్‌ రాకపోవడం వెనుక బలమైన కారణాలేమైనా ఉన్నాయేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

గత కొద్దికాలంగా సీఎం చంద్రబాబుతో ఆయనకు పొసగడం లేదనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అశోక్‌ పార్టీతో, చంద్రబాబుతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే కీలకమైన టీడీపీపీ సమావేశానికి ఆయన గైర్హాజరవడం గమనార్హం. కాగా, చైనా పర్యటనకు వెళ్లిన అశోక్‌ శనివారం రాత్రే రావడంతో సమావేశానికి హాజరుకాలేకపోయారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top