తెలంగాణలో ప్రారంభమైన రెండో విడత పోలింగ్‌ | MPTC ZPTC Elections Second Phase Polling Started In Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో ప్రారంభమైన రెండో విడత పోలింగ్‌

May 10 2019 7:02 AM | Updated on May 10 2019 10:37 AM

MPTC ZPTC Elections Second Phase Polling Started In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ పరిషత్‌ ఎన్నికల్లో భాగంగా ఉదయం 7 గంటలకు రెండో విడత పోలింగ్‌ ప్రారంభమైంది. నేడు (మే 10) జరగనున్న రెండో దశలో 179 జెడ్పీటీసీ స్థానాలకు 805 మంది, 1,850 ఎంపీటీసీ స్థానాలకు 6,146 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఈ విడతలో ఒక జెడ్పీటీసీ, 63 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. రెండో విడత ఏకగ్రీవాల్లో ఒక ఎంపీటీసీ మినహా మిగతా స్థానాలన్నీ టీఆర్‌ఎస్‌ ఖాతాలో పడిన విషయం తెలిసిందే. పోలింగ్‌ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. నక్సల్‌ ప్రభావిత ప్రాంతాల్లో నాలుగు గంటలకే ముగియనుంది.  మొత్తం 10,371 పోలింగ్‌ కేంద్రాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) ఏర్పాటు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement