సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ‘‘ముఖ్యమంత్రి అయ్యే అర్హత నాకుంది.. అలాగే అనేకమందికీ ఉంది.. అలాగనీ ఎన్నికలు జరగకుండా.. అధిష్టానం నిర్ణయించకుండా.. ఎవరికివారు అనుకోవడం సరికాదు.. ఏదైనా సీఎం విషయంలో అధిష్టానం నిర్ణయమే శిరోధార్యం’’అని సీఎల్పీ నేత కె.జానారెడ్డి అన్నారు. సీఎం కావడానికి అర్హత ఒక్కటే ప్రామాణికం కాదని, చాలా సమీకరణాలు ఉంటాయని వ్యాఖ్యానించారు. ఆదివారం కరీంనగర్ ఆర్అండ్బీ గెస్ట్హౌస్లో నిర్వహించిన మీడియా చిట్చాట్లో ఆయన మాట్లాడారు. ‘‘టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డితో నాకు ఎలాంటి విభేదాలూ లేవు. సీఎల్పీ, టీపీసీసీ కలిసి చాలా బాగా పనిచేస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్కే పట్టం కడతారు. కాంగ్రెస్కు అధికారమే లక్ష్యంగా అందరం పనిచేస్తున్నాం. కొందరు కాంగ్రెస్ను బలహీనపరిచేందుకు అసందర్భంగా అసత్య ప్రచారం చేస్తున్నారు’’అని అన్నారు.
‘‘మీలాగే హైదరాబాద్లో చిట్చాట్ పెట్టినప్పుడు ‘టీమ్ లీడర్ గట్టిగా ఉండాలి’అని కొంతమంది మిత్రులంటే మా టీమ్లీడర్ బాగానే ఉన్నాడు కదా అన్నాను. గెలవడానికి టీమ్లీడరే కీలకం కాదు.. టీమ్లీడర్ గట్టిగా ఉన్నా.. మిగతా సభ్యులు ఆడకపోతే ఫెయిల్ అయితం. ఒకవేళ టీమ్లీడర్ గాయపడి సభ్యులు బాగా ఆడితే గెలుస్తుంటం. ఆ పేరు కెప్టెన్కే వస్తుంది. అన్నింటికీ సమన్వయం ముఖ్యం’’అని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్కు ఎలాంటి అవగాహన లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో పొత్తులపై ఇంకా ఏమీ నిర్ణయించుకోలేదని, దానికి ఇంకా సమయం ఉందని అన్నారు. తెలంగాణ వస్తే బతుకులు మారుతాయని ప్రజలు భావించారని కానీ నాలుగేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలోని ఏ ఒక్కదాన్ని పూర్తిగా అమలు చేయలేదని విమర్శించారు. మభ్యపెట్టేందుకు రోజుకో హామీ ఇస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్కు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.
సీఎం అయ్యే అర్హత నాకుంది: జానా
Published Mon, May 14 2018 1:20 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
T20 World Cup 2024: చరిత్ర సృష్టించనున్న రోహిత్ శర్మ
మరికొన్ని గంటల్లో యాపిల్ ‘లెట్ లూస్ ఈవెంట్’
ముస్లిం సమాజం మారాలి: ప్రధాని మోదీ విజ్ఞప్తి
వైఎస్సార్సీపీ మహిళా కార్యకర్తలపై బోండా ఉమా కొడుకు దాడి
కేజ్రీవాల్కు జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రేమ లేఖ!
ధోని గురించి నిజాలు ఇవే! మాజీ క్రికెటర్లకు కౌంటర్
వ్యవస్థలను మేనేజ్ చేసేది చంద్రబాబే: ఎమ్మెల్సీ లేళ్ల
దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
తప్పక చదవండి
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నారా? హార్దిక్ సమాధానం ఇదే!
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వారందరి జీవితాలను మార్చేసిన 'ఆర్య'కు 20 ఏళ్లు
- వైజాగ్ మాల్యా.. వంశీ!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement