ఏపీకి ప్రథమ శత్రువు చంద్రబాబే | Gadikota Srikanth Reddy Fires On Chandrababu Naidu For Special Category Status | Sakshi
Sakshi News home page

ఏపీకి ప్రథమ శత్రువు చంద్రబాబే

May 7 2018 4:11 PM | Updated on Jul 24 2018 1:12 PM

Gadikota Srikanth Reddy Fires On Chandrababu Naidu For Special Category Status - Sakshi

సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రథమ శత్రువు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌ రెడ్డి ఆరోపించారు. బీజేపీని రాష్ట్రానికి రెండో శత్రువుగా, కాంగ్రెస్‌ని మూడో శత్రువుగా భావిస్తున్నామన్నారు. మేము ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవడం లేదని స్పష్టం చేశారు. ఈ విషయం ఎన్నిసార్లు చెప్పినా.. టీడీపీ తమపై తప్పుడు ప్రచారం చేస్తుందని విమర్శించారు. టీడీపీ అవిర్భావం నుంచి కూడా పొత్తులతోనే ఎన్నికలకు వెళ్తుందని గుర్తుచేశారు. టీడీపీని కూడా చంద్రబాబు సర్వనాశనం చేశారని అన్నారు. ప్రత్యేక హోదా పేరిట ధర్మ పోరాట మంటూ కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని చంద్రబాబుపై ఆయన మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement