ప్రజా వ్యతిరేక విధానాలపై పోరు: సీపీఐ | Fighting on anti-people policies | Sakshi
Sakshi News home page

ప్రజా వ్యతిరేక విధానాలపై పోరు: సీపీఐ

Dec 22 2017 2:12 AM | Updated on Aug 10 2018 5:32 PM

Fighting on anti-people policies - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రజలను చైతన్యపరచాలని సీపీఐ నిర్ణయించింది. సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి ముఖ్య అతిథిగా గురువారం మఖ్దూం భవన్‌లో రాష్ట్ర కార్యదర్శి వర్గ సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పనితీరు సహా వివిధ అంశాలపై చర్చించామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో టీఆర్‌ఎస్‌ విఫలమైందని సీపీఐ ఆరోపించింది. ప్రజాస్వామ్య ఆకాంక్షలను నిలబెట్టేందుకు వామపక్ష, ప్రజాతంత్ర, లౌకిక శక్తులను కలుపుకొని ప్రజా ఉద్యమాలు చేయాలని నిర్ణయించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement