ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల

Election Commission of India Releases Bypolls Schedule - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని నాలుగు లోక్‌సభ స్థానాలు, పది అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్‌ ఖరారైంది. కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఉప ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసింది. మహారాష్ట్రలో బాంద్రా- గోండ్యా, పాల్గర్‌ లోక్‌సభ స్థానాలకు, ఉత్తరప్రదేశ్‌లోని ఖైరానా, నాగాలాండ్‌ లోక్‌సభ స్థానాలకు ఈ ఉప ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటు బిహార్‌, జార్ఖండ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లలోని 10 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు షెడ్యూలు జారీ చేశారు. లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు మే నెల 28న పోలింగ్ నిర్వహించనుండగా‌, మే 31న ఓట్ల లెక్కింపు జరగనుంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top