పుంజుకున్న బీజేపీ..పత్తాలేని కాంగ్రెస్‌

Delhi Election Results 2020: BJP Regained - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ పీటాన్ని మరోసారి సామన్యుడే అధిరోహించనున్నాడు. తాజాగా వెలువడుతున్న ఫలితాల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ దూసుకుపోతోంది. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలకు అనుగుణంగా ఆప్‌ ఘనవిజయం దిశగా దూసుకుపోతోంది. ఇప్పటి వరకు వెలువడి ఫలితాల ప్రకారం ఉదయం 10.35గంటలకు ఆప్‌ 49 స్థానాల్లో ముందంజలో కొనసాగుతుండగా, బీజేపీ 21 స్థానాల్లో లీడ్‌లో ఉంది. ఇక కాంగ్రెస్‌ పార్టీ పత్తా లేకుండా పోయింది. ఒక్క స్థానంలో కూడా ఆ పార్టీ ఆధిక్యంలో లేకపోవడం గమనార్హం. గత ఎన్నికల్లో కేవలం మూడు స్థానాల్లో గెలుపొందిన బీజేపీ.. ఈసారి పుంజుకుంది. గతం కంటే ఐదింతలు మెరుగైంది.  27 స్థానాల్లో ఆప్‌, బీజేపీ మధ్య పోటీ హోరా హోరీగా ఉంది. 14 స్థానాల్లో ఆప్‌కు బీజేపీ గట్టి పోటీ ఇస్తోంది. మెడల్‌ టౌన్‌లో బీజేపీ అభ్యర్థి కపిల్‌ మిశ్రా ముందంజలో ఉన్నారు. చాందినీలో ఆప్‌ 9, బీజేపీ ఒక స్థానంలో ముందంజలో ఉన్నాయి. నార్త్‌ ఈస్ట్‌ ఢిల్లీలో ఆప్‌ 6, బీజేపీ4, ఈస్ట్‌ ఢిల్లీలో ఆప్‌ 6, బీజేపీ 4 , న్యూఢిల్లీలో ఆప్‌ 9, బీజేపీ 1, నార్త్‌ వెస్ట్‌ ఢిల్లీలో ఆప్‌ 8, బీజేపీ2, వెస్ట్‌ ఢిల్లీలో ఆప్‌ 6, బీజేపీ4, సౌత్‌ ఢిల్లీలో ఆప్‌ 7, బీజేపీ3 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top