బీజేపీ దూకుడుకు బ్రేక్‌.. కాంగ్రెస్‌ క్లీన్‌ స్వీప్‌

Congress gives shock to BJP in local body elections - Sakshi

నాందేడ్‌ పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్‌ హవా

నాందేడ్‌: నాందేడ్‌–వాఘాలా మున్సిపల్‌ కార్పొరేషన్‌ (ఎన్‌డబ్ల్యూ ఎంసీ)కు ఇటీవల జరిగిన  ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘనవిజయం సాధించింది. 54 స్థానాలకు గురువారం ఫలితాలు ప్రకటించగా అందులో  గాను 49 స్థానాలను ఆ పార్టీ కైవసం చేసుకుంది. బీజేపీకి మూడింటిని గెలుచుకోగా శివసేన ఒక్క స్థానంలోనే విజయం సాధించింది. దీంతో ఈ ఎన్నికల్లో ఉద్ధవ్‌ఠాక్రే నేతృత్వంలోని శివసేన మూడోస్థానానికి పరిమితమైంది. మరోవైపు అసదుద్దీన్‌ ఒవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎంకు కూడా దెబ్బతగిలింది. ఈ పార్టీకి ప్రస్తుతం 11 మంది కార్పొరేటర్లు ఉండగా అది ఇప్పుడు శూన్యమైపోయింది. ఎన్నికల సందర్భంగా విస్తృత స్థాయిలో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న మహారాష్ట్ర ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (ఎంపీసీసీ) అధ్యక్షుడు అశోక్‌చవాన్‌కు ఈ ఫలితాలు ఎనలేని సంతోషాన్నిచ్చాయి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top