ఫ్రంట్‌: కేసీఆర్‌ ప్రయత్నాలు ముమ్మరం | CM KCR will meet Odisha CM Naveen Patnaik | Sakshi
Sakshi News home page

ఫ్రంట్‌: కేసీఆర్‌ ప్రయత్నాలు ముమ్మరం

Apr 17 2018 11:52 AM | Updated on Aug 15 2018 9:06 PM

CM KCR will meet Odisha CM Naveen Patnaik - Sakshi

కె.చంద్రశేఖర్‌రావు

సాక్షి, హైదరాబాద్ : దేశంలో గుణాత్మక మార్పుకోసం జాతీయ స్థాయిలో కూటమిని ఏర్పాటు చేయాలన్న పట్టుదలతో ఉన్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఫెడరల్‌ ఫ్రంట్‌లో చేరే పార్టీలు, ఆ పార్టీ అధినేతలతో దశలవారీగా భేటీ కావడానికి ఇప్పటికే సీఎం రూట్‌మ్యాప్‌ రూపొందించుకున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మాజీ ప్రధాని దేవేగౌడలతో కేసీఆర్‌ భేటీ అయి ప్రస్తుత రాజకీయాలు, జాతీయ స్థాయిలో పలు అంశాలపై చర్చించిన విషయం తెలిసిందే.

తాజాగా కేసీఆర్‌ ఒడిశాలో పర్యటించనున్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేడీ అధ్యక్షుడు నవీన్‌ పట్నాయక్‌తో ఆయన సమావేశం కానున్నారు. ఒడిశాలో  ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండటంతో మే మొదటి వారంలో నవీన్‌ పట్నాయక్‌తో భేటీ కావాలని కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement