-
ఒడిస్సీ బాలినీస్ నృత్యాల వందేమాతర సంగమం!
బంకిమ్ చంద్ర ఛటోపాధ్యాయ విరచిత ‘వందేమాతరం‘ ఖ్యాతి మరోసారి విశ్వ యవనికపై తొణికిసలాండింది! వియత్నాంలోని బాలీలోని భారతీయ దౌత్య కార్యాలయం దీనికి వేదికైంది. భారత నృత్య శైలుల్లో ఒకటైన ఒడిస్సీకి బాలినీస్ శైలి కూడా తోడైంది. వందేమాతరమంటూ.. పదాలు సొగసుగా కదిలాయి. హావభావాలు వ్యక్తమయ్యాయి. ఈ వీడియో కాస్తా ఇప్పుడు నెట్లో వైరల్గా మారింది. పలువురి అభిమానాన్ని చూరగొంటోంది. ఎందుకు? ఏమిటి? ఎలా? చూసేయండి మరి! కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా బాలిలో వందేమాతరం పాటకు ప్రత్యేక శైలిలో నృత్య ప్రదర్శన జరిగింది. భారతదేశ 74వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బాలిలో నిర్వహించారు. ఇది ఒడిస్సీ, బాలినీస్ సంప్రదాయ నృత్యాలను మిక్స్ చేసిన నృత్య ప్రదర్శన. ఇది ఎంతగా ఆకట్టుకుంటుందంటే..ప్రేక్షకులు మైమరిచి చూస్తుండి పోయేంతగా! ఆ యువతులిద్దరూ చాలా చక్కటి అభినయంతో చేశారు. బంకిం చంద్ర ఛటోపాధ్యాయ రాసిన జాతీయ గీతం వందేమాతరం పాట ప్రతి భారతీయుడిలో దేశభక్తి ఉప్పొంగేలే చేస్తుంది. తెలియని అనుభూతి కలిగుతుంది. అలాంటి అద్భుతమైన గీతానికి చక్కటి నృత్యంతో అబ్బురపరిచారు ఆ యువతులు. ఈ నృత్య ప్రదర్శన ఇచ్చిన ఇద్దరు యువతుల్లో ఒకరు బాలిలో ఒడిస్సీ టీచర్ డా పాంపిపాల్ కాగా, మరోకరు బాలినీస్ డ్యాన్సర్ మెలిస్సా ఫ్టోరెన్స్ షిల్లెవోర్ట్. ఇద్దరు వేర్వేరు డ్యాన్సర్లు కలిసి ఒక దేశ భక్తి పాటకు ఇచ్చి ఈ ప్రదర్శన అద్భుతః ! అన్నంతగా నెటిజన్లను ఆకట్టుకుంది. Vandhe Maatram - Odissa & Bali dancers pic.twitter.com/hzj4bSv26o — Aviator Anil Chopra (@Chopsyturvey) April 11, 2024 (చదవండి: అత్యంత ఖరీదైన టీకప్పు..ధర వింటే షాకవ్వుతారు!) -
మీకు తెలుసా.. ఒక అసెంబ్లీ స్థానానికి ఇద్దరు ఎమ్మెల్యేలు!
కొరాపుట్: ఎక్కడైనా ఒక్కో అసెంబ్లీ స్థానానికి ఒక్క ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహించడం సర్వసాధారణం. కానీ గతంలో ఒక అసెంబ్లీ స్థానానికి ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించిన విషయం చాలా మందికి తెలియదు. ఈ విషయం ఒడిశా అసెంబ్లీ రికార్డుల్లో సైతం నమోదై ఉంది. ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో మాత్రమే ఈ నిబంధన ఉండేదని తెలుస్తోంది. బలహీన వర్గాలకు చేయూతనివ్వడానికి ఒక నియోజకవర్గంలో ఒక జనరల్ కేటగిరి ఎమ్మెల్యేతో పాటు ఒక రిజర్వ్ కేటగిరి ఎమ్మెల్యే ఉండేవారు. నబరంగ్పూర్ విధానసభ స్థానం నుంచి 1951లో కాంగ్రెస్ పార్టీ తరుపున జనరల్ కేటగిరి కింద సదాశివ త్రిపాఠి, రిజర్వ్ కేటగిరిలో ముది నాయక్ ప్రాతినిధ్యం వహించారు. 1957లో ఇదే స్థానం నుంచి అదే పార్టీకి చెందిన సదాశివ త్రిపాఠితో పాటు రిజర్వ్ కేటగిరిలో మిరు హరిజన్ కొనసాగారు. ఈ నిబంధనను ప్రభుత్వం ఎత్తివేసింది. జయపూర్, ఉదయగిరి, అనుగుల్, పాల్ లక్రా కే నగర్, డెంకనాల్, భవానీపట్న, జునాగఢ్, నువాపడా, టిట్లాగఢ్, పాట్నగఢ్, బొలంగీర్, పదంపూర్, సోహేలా, రైరాకోల్, జర్సుగుడ, బెమ్రా, సుందర్ గఢ్, కెంజోర్, ఆనంద్పూర్, పంచ్పిర్, బరిపద, నిలగిరి, చందబలి, సుకింద, జాజ్పూర్, బింజాపూర్, అవౌల్, సాలేపూర్, కటక్ రూరల్, నిమాపరా, భువనేశ్వర్, నయాగడ్, కేంద్రపడా, దసపల్లా, అస్కా, బ్రహ్మపుర, పర్లాకిమిడి స్థానాల్లో సైతం ఇద్దరేసి ఎమ్మెల్యేలు ఉండేవారు. -
పొత్తు లేనట్లే.. బీజేపీ తేల్చేసిందా?
సాక్షి, భువనేశ్వర్ : బీజేపీ - బీజేడీల మధ్య ఇక పొత్తు లేనట్లేనని తెలుస్తోంది. ఈ సారి లోక్సభ ఎన్నికలకు 15 ఏళ్ల తర్వాత పాత మిత్రులు మళ్లీ ఒక్కటవ్వనున్నారని అందరూ అనుకున్నారు. కానీ తాజా రాజకీయ పరిణామాలు అందుకు తావు ఇవ్వడం లేదని సమాచారం. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఒడిశా రాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం ప్రధాని మోదీ ఒడిశాలో పర్యటించారు. ఆ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేడీ అధినేత, ఆ రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్లు మంతనాలు జరిపారు. అనంతరం 15 ఏళ్ల తర్వాత బీజేపీతో జతకట్టేలా సంకేతాలిచ్చారు. అమిత్ షా తో సుదీర్ఘంగా చర్చలు ఇందులో భాగంగా పొత్తు పెట్టుకుని లోక్సభ ఎన్నికల బరిలో దిగేలా ఇరు పార్టీల అగ్రనేతలు చర్చలు జరిపారు. అయితే, సీట్ల పంపకాల్లో విభేదాలు తలెత్తడంతో.. బీజేపీ ఒంటరిగా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తుందంటూ ఒడిశా బీజేపీ అధ్యక్షుడు మన్మోహన్ సామల్ ప్రకటించారు. పొత్తుపై చర్చించేందుకు అధిష్టానం పిలుపుతో ఢిల్లీకి వెళ్లిన మన్మోహన్ సాముల్.. కేంద్రమంత్రి అమిత్ షాతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. చర్చల అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పొత్తులపై మన్మోహన్ సాముల్ మాట్లాడుతూ.. ‘మా జాతీయ అధ్యక్షుడు, పార్లమెంటరీ పార్టీ ఏది చెబితే అది తుది నిర్ణయం’ అని అన్నారు. సీనియర్ నేతలతో సీఎం భేటీ ఆ తర్వాతే ఒడిశాలో బీజేపీ సొంతంగా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందంటూ ఎక్స్.కామ్లో ఓ పోస్ట్ పెట్టారు. కొద్ది సేపటికే ఆ పోస్ట్ను డిలీట్ చేశారు. మరోవైపు బీజేడీ పార్టీ అధ్యక్షుడు, సీఎం నవీన్ పట్నాయక్ తన నివాసంలో పార్టీ సీనియర్ నేతల సమావేశాన్ని నిర్వహించారు. ఇలా వరుస పరిణామాలతో ఒడిశా రాష్ట్ర రాజకీయాలు రసకందాయంగా మారాయి. పోలింగ్కు సమయం ఉంది కాబట్టి పొత్తులపై బీజేపీ- బీజేడీలు చర్చలు జరుపుతుంటే.. ఇరు పార్టీల నేతలు మాత్రం ఎప్పుడు ఏం జరుగుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తుండడం గమనార్హం. -
ఒడిశా టు హైదరాబాద్.. తాజాగా పట్టుబడిన గంజాయి ‘చాక్లెట్లు’
ఖమ్మం: ఒడిశా నుంచి తెలంగాణలోని జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాలకు గంజాయి తరలించే స్మగ్లర్లకు జిల్లా రాచబాటగా మారింది. ఎక్సైజ్, పోలీసు అధికారులు ఎంత కట్టడి చేసినా.. తనిఖీలు ముమ్మరంగా చేపడుతున్నా ఎక్కడో చోట గంజాయి పట్టుబడడం సర్వసాధారణమైపోయింది. అయితే, ఇన్నాళ్లు గంజాయిని బస్తాల్లో.. ఆ తర్వాత పోలీసుల నుంచి తప్పించుకోవడం కోసం వాహనాల్లో ఇతర సరుకుల కింద తరలించేవారు. అనంతరం నూనెగా మార్చి కూడా తరలిస్తున్నట్లు గుర్తించారు. ఇదంత ఎందుకు అనుకున్నారో ఏమో కానీ ఏకంగా గంజాయిని చాక్లెట్ల రూపంలోకి మార్చి తరలిస్తుండగా ఎక్సై జ్ అధికారులు గుర్తించారు. తాజాగా జిల్లా కేంద్రంలో చేపట్టిన తనిఖీల్లో ఈ గంజాయి చాక్లెట్లు పట్టుబడగా అవాక్కవడం ఎక్సైజ్ పోలీసుల వంతు అయింది. ఒడిశా టు హైదరాబాద్.. ఒడిశాలోని మల్కాన్గిరి జిల్లా గంజాయి సాగుకు పెట్టింది పేరు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పలువురు అక్కడకు వెళ్లి గంజాయి కొనుగోలు చేసి ప్యాకెట్లుగా తీసుకెళ్తుంటారు. తాజాగా అక్కడే గంజాయిని చాక్లెట్ల రూపంలోకి మార్చి ఎవరికీ అనుమానం రాకుండా మహిళల చేత రవాణా చేయిస్తున్నట్లు సమాచారం. ఈమేరకు మహిళలు ఖమ్మంలో పట్టుబడగా... తనిఖీ చేసిన అధికారులే నివ్వెరపోయారు. ఒక్కో ప్యాకెట్లో ఐదు గ్రామాల చొప్పున 40చాక్లెట్లుగా ఉండగా ఆ ప్యాకెట్ను రూ.90కు కొనుగోలు చేసి రూ.400 చొప్పున విక్రయిస్తున్నట్లు గుర్తించారు. చార్మినార్ గోల్డ్, మున్కా తదితర పేర్లతో ఈ చాక్లెట్లు ఒడిశా ప్రాంతంలోనే తయారవుతున్నట్లు తెలిసింది. చాక్లెట్లకు డిమాండ్.. గంజాయికి అలవాటు పడిన వారు పొడి కొనుగోలు చేయడం.. పీల్చడం చేస్తుంటారు. అయితే, ప్యాకెట్ల రవాణా సమయంలో తరచుగా పట్టుబడుతండడంతో అమ్మకం, కొనుగోలుదారులు చాక్లెట్లపై దృష్టి సారించినట్లు సమాచారం. దీంతో ఒడిశాలోని స్మగ్లర్లు గంజాయి చాక్లెట్లు తయారుచేస్తున్నట్లు తెలిసింది. తద్వారా వీటి వాడకం సులువవుతుందని, తనిఖీల్లోనూ పట్టుబడే అవకాశాలు తక్కువగా ఉంటాయనే భావనకు వచ్చినట్లు చెబుతున్నారు. అంతేకాక కావాల్సినప్రాంతాలకు చేరవేసి అమ్మడం సులువవుతుందని గంజాయిని చాక్లెట్ల రూపంలో మారుస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్లో కొన్నాళ్ల క్రితం చాక్లెట్లు పట్టుబడగా మూడు రోజుల క్రితం వరంగల్ క్రాస్ రోడ్డు వద్ద మూడు కేజీల గంజాయి చాక్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకోవడం సంచలనం కలిగించింది. పోలీసులకు చిక్కేది కొందరే.. గంజాయి తరలిస్తూ పోలీసులకు చిక్కుతున్న వారు కొందరేనని.. అది కూడా కూలీలేనని సమాచారం. అసలు సూత్రధారులు ఎక్కడా పట్టుపడకుండా తెర వెనక ఉండి దందా నడిపిస్తుంటారని తెలిసింది. ఒడిశా నుంచి గంజాయితో జిల్లాకు చేరుకుంటున్న పలువురు సాధారణ ప్రయాణికుల మాదిరి బస్సుల్లో వెళ్తుండగా.. ఇంకొందరు రైళ్లను ఎంచుకుంటున్నారు. అయితే, తెలంగాణలో మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టాక ఇదే అదునుగా రద్దీగా ఉంటున్న బస్సుల్లో గంజాయిని తరలిస్తున్నట్లు తెలిసింది. అయితే, అసలు సూత్రధారులు దొరకనంత కాలం గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేయడం సాధ్యం కాకపోవచ్చని పలువురు భావిస్తున్నారు. ఇవి చదవండి: కమీషన్లకు ఆశపడి.. -
స్పైసీ స్పైసీ ఎర్ర చీమల చట్నీ: ఇక వరల్డ్ వైడ్గా మారు మోగనుంది
చీమల పచ్చడి గురించి ఎపుడైనా విన్నారా? ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్, ఒడిశాలోని మయూర్భంజ్లోనూ ఇది ఫ్యామస్. రుచికరమైన చట్నీలో ఎన్నో ఆరోగ్య ప్రయోజ నాలున్నాయని తాజాగా పరిశోధకులు తేల్చారు. సిమిలిపాల్ టైగర్ రిజర్వ్తో సహా జిల్లాలోని ప్రతి బ్లాక్ ఏరియాలోని అడవులలో ఏడాది పొడవునా సమృద్ధిగా కనిపిస్తాయి. ఒడిశాలోని మయూర్భంజ్ ప్రజలు దీన్ని విరివిగా వాడతారు. వీరు తయారు చేసే స్పైసీ స్పైసీ రెడ్ యాంట్ చట్నీకి ఇప్పటికే భిన్నమైన గుర్తింపు లభించడంతో పాటు ఇపుడిక జీఐ ట్యాగ్ కూడా అందుకోవడం విశేషంగా నిలిచింది. దీంతో రెడ్ యాంట్ చట్నీ ఇక వరల్డ్ వైడ్గా గుర్తింపును తెచ్చుకోనుంది. మయూర్భంజ్ రెడ్ యాంట్ చట్నీకి GI ట్యాగ్ మయూర్భంజ్లోని రెడ్ చట్నీపై చేసిన పరిశోధనలో, శాస్త్రవేత్తలు రెడ్ వీవర్ చీమలను విశ్లేషించారు. ఇందులో ప్రోటీన్, కాల్షియం, జింక్, విటమిన్ బి-12, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, కాపర్, అమినో యాసిడ్లు ఉన్నాయని పరిశోధకులు కనుగొన్నారు. ఈ పోషకాలను తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచి, వ్యాధులను నివారించవచ్చని గుర్తించారు. రెండ్ యాంట్ చట్నీ కేవలం రుచికి మాత్రమే కాదు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. దాని వైద్యపరమైన లక్షణాల కారణంగా ఇది స్థానిక ప్రాంతంలో బాగా ప్రాచుర్యం పొందింది. ప్రకృతితో ముడిపడి ఉన్న ప్రజల పోషకాహార భద్రతకు ఇది చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. స్థానికుల విశ్వాసంతో పాటు, ఈ చట్నీలోని ఔషధ గుణాలను నిపుణులు ఇప్పటికే గుర్తించారు. జ్వరం, జలుబు, దగ్గు, ఆకలిని తగ్గించడానికి, కంటి చూపు, కీళ్ల నొప్పులు, ఆరోగ్యకరమైన మెదడును మెరుగుపరచడంలో సహాయపడుతుందని తేల్చిన సంగతి తెలిసిందే. ఈ చీమల నుండి తయారుచేసిన సూప్ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందట. స్థానికంగా చాప్ డా అని పిలిచే ఈ చీమల పచ్చడికి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఎర్ర చీమల చట్నీ ఎలా తయారు చేస్తారంటే ఈ రెడ్ వీవర్ చీమలను వాటి గుడ్లతో పాటు గూళ్ళ నుండి సేకరించి శుభ్రం చేస్తారు. దీని తరువాత, ఉప్పు, అల్లం, వెల్లుల్లి, కారం కలిపి, గ్రైండ్ చేయడం ద్వారా చట్నీ తయారు చేస్తారు. ఈ చట్నీ కారం..కారంగా , పుల్లగా ఉంటుంది కానీ చాలా రుచిగా ఉంటుంది. స్థానిక గిరిజనులు తమ ఆహారంలో చేర్చుకుంటారు. ఇందులోని ప్రొటీన్, కాల్షియం, ఫామిక్ యాసిడ్, ఇతర పోషక గుణాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి మారుమూల గిరిజనవాసులకు ఎంతో మేలు చేస్తాయి. ఈ చట్నీ మలేరియా, కామెర్లు తదితర కొన్ని రకాల వ్యాధులను కూడా నయం చేస్తుందని స్థానిక గిరిజనుల విశ్వాసం. అలాగే కొలంబియా, మెక్సికో, బ్రెజిల్లోనూ చీమలను ఆహారంగా తీసుకుంటారు. ఈ నేపథ్యంలోనే OUAT బృందం 2020లో శాస్త్రీయ ఆధారాలతో జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ గుర్తింపుకోసం చేసిన ప్రయత్నం ఫలించింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
IPL 2024 PBKS VS CSK: రుతురాజ్ను వెంటాడుతున్న దరిద్రం
ఉంగరంతో ఆరోగ్యం పదిలం!
Shobha Shetty : గ్రాండ్గా ప్రియుడితో సీరియల్ నటి శోభా శెట్టి ఎంగేజ్మెంట్ (ఫోటోలు)
గ్రాండ్గా నటుడి కుమార్తె రిపెప్షన్ వేడుక.. సందడి చేసిన ప్రముఖ తారలు!
సీఎం జగన్ రేపటి ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్ ఇదే
నాన్న చనిపోయినా వేళ్లలేదు.. బంధువులంతా తిట్టారు: కోవై సరళ ఎమోషనల్
IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
రెచ్చిపోయిన ఇసుక మాఫియా.. ట్రాక్టర్తో తొక్కించి ఏఎస్ఐ హత్య
హీరోగా జబర్దస్త్ కమెడియన్.. ఆసక్తిగా ట్రైలర్!
తప్పక చదవండి
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..!
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- రేటే 'బంగార'మాయెనే..!
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement