ప్రాణం తీసిన గప్‌చుప్‌ 

Women Lost Life Eating Panipuri Getting Stuck In Windpipe In Odissa - Sakshi

భువనేశ్వర్ ‌: ఆబాలగోపాలం లొట్టలేసుకుని ఆరగించే గప్‌చుప్‌  ఓ మహిళ ప్రాణాల్ని బలిగొంది. బంగాళదుంప మిశ్రమం కూరిన చిన్న డొల్ల పూరీలో చురచురలాడించే చింతపండు నీరు నింపుకుని గుటుక్కున (గప్‌చుప్‌) మింగేయడంలో జరిగిన తొందరపాటు చర్య ఈ ప్రమాదానికి కారణమైంది. సుందరగడ్‌ జిల్లా లెఫ్రిపడా పోలీసు స్టేషన్‌ పరిధి సరఫ్‌గడ్‌ గ్రామంలో మంగళవారం రాత్రి ఈ విషాదం జరిగింది.  స్థానికురాలైన ఫూలమతి కిషాన్‌ (30) అనే మహిళ సరదాగా మింగబోయిన గప్‌చుప్‌ ఆమె గొంతు గుండా  శ్వాసనాళంలో ఇరుక్కుపోవడంతో ఉక్కిరి బిక్కిరై అక్కడికక్కడే కుప్పకూలింది. భర్త, కుమారుడితో కలిసి ఇంటి ఆవరణలో గప్‌చుప్‌ తింటుండగా ఈ విషాదం సంభవించింది. హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే ప్రాణం పోయినట్లు వైద్యులు ప్రకటించారు.   

Read latest Orissa News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top