కోర్టుతీర్పును స్వాగతిస్తున్నాం: లక్ష్మణ్‌ | BJP welcome the court verdict On Mecca Masjid Blasts Case MLA Laxman Say | Sakshi
Sakshi News home page

కోర్టుతీర్పును స్వాగతిస్తున్నాం: లక్ష్మణ్‌

Apr 16 2018 8:40 PM | Updated on Apr 16 2018 8:40 PM

BJP welcome the court verdict On Mecca Masjid Blasts Case MLA Laxman Say - Sakshi

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌

సాక్షి, హైదరాబాద్‌ : మక్కా మసీదు పేలుళ్ల కేసులో ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హిందూ సమాజాన్ని వ్యతిరేకించే కాంగ్రెస్‌, మజ్లిస్ పార్టీలకు ఈతీర్పు చెంప పెట్టులాంటిదన్నారు. నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ కేసులో అమాయకులని ఇరికించిందన్నారు. అసలు నిందితులపై కీలక సాక్ష్యాలు లేకుండా చేసిందని ఆరోపించారు.

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరూ కర్ణాటకలో బీజేపీని ఓడించే ప్రయత్నం చేస్తున్నారని, వాళ్ల జిమ్మిక్కులు అక్కడి ప్రజలు నమ్మరని వ్యాఖ్యానించారు. ప్రత్యేక విమానంలో బెంగాల్‌, బెంగళూరుకు వెళ్లే సమయం ఉన్న కేసీఆర్‌కు అంబేద్కర్‌కు నివాళులు అర్పించే సమయం లేదా అని నిలదీశారు. కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణలో అమిత్‌ షా పర్యటన ఉంటుందని లక్ష్మణ్‌ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement