బాలకృష్ణ వ్యాఖ్యలపై బీజేపీ సీరియస్‌ | bjp Leaders Complaint to Governor Narasimhan over balakrishna comments | Sakshi
Sakshi News home page

బాలకృష్ణ వ్యాఖ్యలపై బీజేపీ సీరియస్‌

Apr 21 2018 9:40 AM | Updated on Aug 29 2018 1:59 PM

bjp Leaders Complaint to Governor Narasimhan over balakrishna comments - Sakshi

సాక్షి, విశాఖ: ప్రధాని నరేంద్రమోదీపై హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతాపార్టీ తీవ్రంగా పరిగణించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం ధర్మ పోరాట దీక్ష పేరుతో చేపట్టిన కార్యక్రమంలో పాల్గొన్న బాలకృష్ణ..  మోదీ శిఖండిలా, కొజ్జాలా రాజకీయాలు చేస్తూ ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారని తీవ్రంగా ఆరోపించారు. దీంతో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యాలపై రాష్ట్ర బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఈ క్రమంలో శనివారం విశాఖ పర్యటనలో ఉన్న గవర్నర్‌ నరసింహన్‌తో బీజేపీ నేతలు భేటీ అయ్యారు. ధర్మ పోరాట దీక్షలో మోదీపై బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్యే విష్టుకుమార్‌రాజు, ఎమ్మెల్సీ మాధవ్‌లు ఈ సందర్భంగా గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం బీజేపీ నేతలు మాట్లాడుతూ.. రాజ్యాంగం పట్ల గౌరవం లేని వ్యక్తి ప్రజాప్రతినిధిగా కొనసాగే హక్కు లేదని పేర్కొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement