'బాబు ఆర్థిక లావాదేవీలన్ని శ్రీనివాస్‌కు తెలుసు' | BJP Leader Kosuru Venkat Fires On Chandrababu In Vijayawada | Sakshi
Sakshi News home page

'బాబు ఆర్థిక లావాదేవీలన్ని శ్రీనివాస్‌కు తెలుసు'

Feb 16 2020 2:47 PM | Updated on Feb 16 2020 3:30 PM

BJP Leader Kosuru Venkat Fires On Chandrababu In Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ : చంద్రబాబుకు పీఎస్‌గా పనిచేసిన శ్రీనివాస్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పిన టీడీపీ నేతలు ఇప్పుడు మాత్రం అతన్ని వెనుకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి కోసూరు వెంకట్‌ మండిపడ్డారు. ' 20 సంవత్సరాల నుంచి చంద్రబాబునాయుడు దగ్గర శ్రీనివాస్‌ పీఎస్‌గా పనిచేసిన సంగతి అందరికి తెలుసు. బాబుకు సంబంధించిన అన్ని ఆర్థిక లావాదేవీలన్ని శ్రీనివాస్‌కు తెలుసు. శ్రీనివాస్‌పై జరిగిన ఐటీ దాడిపై బాబు ఎందుకు నోరు మెదపడం లేదు, బాబుతో పాటు లోకేష్‌పై కూడా ఐటీ విచారణ చేయాలి. చంద్రబాబును పచ్చమీడియా కాపాడే ప్రయత్నం చేస్తుందని, కేవలం రెండు లక్షల రూపాయల కోసం ఆరు రోజులు పాటు ఐటీ అధికారులు సోధాలు నిర్వహించరు. రెండు వేల కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు జరిగినట్లు ఐటీ అధికారులు స్పష్టంగా పేర్కొన్నారంటూ' వెంకట్‌ ధ్వజమెత్తారు.

ఐటీ ఉచ్చులో అవినీతి చక్రవర్తి

ఐటీ దాడులపై నోరువిప్పని చంద్రబాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement